జేఈఈ మెయిన్-2 వాయిదా
25 నుంచి రెండో సెషన్ పరీక్షలు.. నేటి నుంచి హాల్టికెట్ల డౌన్లోడ్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థులను మరోసారి టెన్షన్కు గురిచేసింది. గురువారం నుంచి ప్రారంభం కావా ల్సిన జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షలకు కేవలం ఒక్క రోజు ముందే ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నెల 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్-2 పరీక్షలు నిర్వహిస్తామని ఎన్టీఏ తొలుత ప్రకటించింది. తాజాగా పరీక్షలను 25 నుంచి నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ పరీక్షలకు 6,29,779 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్-1 పరీక్షలకు పలు కేంద్రాల్లో సర్వర్డౌన్ సమస్యలు తలెత్తాయి. తాజాగా మెయిన్ -2 ఎగ్జామ్స్ను ఎలా నిర్వహిస్తారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షల అడ్మిట్కార్డులు గురు వారం నుంచి అందుబాటులో ఉంటాయని ఎన్టీఏ పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధనా పరాశర్ వెల్లడించారు. విద్యార్థులు అడ్మిట్కార్డుతోపాటు అండర్టేకెన్ ఫాంను jeemain.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక