ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
- సమాజం అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం సామాజిక ప్రవర్తనల, అభివృద్ధిని శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే సమాజ శాస్త్రం.
- ప్రపంచ సమాజశాస్త్ర పితామహుడు – ఆగస్ట్ కామ్ట్టే
- భారతదేశంలో సమాజశాస్త్ర పితామహుడు – గోవింద సదాశివ ఘర్యే
- సమాజం అనేది సామాజిక సంబంధాల అల్లిక అని చెప్పింది – మెకైవర్
రాబర్టెడ్ రెడ్ ఫీల్డ్ ప్రకారం సమాజాలు రెండు రకాలు
1. జానపద సమాజాలు
2. పట్టణ సమాజాలు
ఆగస్ట్ కామ్టే భౌతిక శాస్త్రం లాగే, శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి సమాజంలోని మానవుని చర్యలు అధ్యయనం చేయడం సమాజ శాస్త్రం అని చెప్పారు.
సమాజం లక్షణాలు
1) ఒకే భౌగోళిక సరిహద్దు, ఉమ్మడి సంస్కృతి, ఒకే విధమైన, విశిష్టమైన ఉనికిని కలిగి ఉంటుంది.
2) అంతఃసమూహం (ఉదా: ఒకే గ్రామంలో ఉండేవారు)
3) స్వతంత్రమైనది
4) శాశ్వతమైనది
5) ఐక్యంగా ఉంటారు
6) లైంగిక నియంత్రణ, సాంఘిక నియంత్రణ కలిగి ఉంటుంది.
7) శ్రమవిభజన అనే విశిష్టమైన లక్షణం కలిగి ఉంటుంది.
జజ్మాని వ్యవస్థ
- ఇది యజమాని అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. దీనిపై విలియం వైజర్ ది ఇండియన్ జజ్మాని సిస్టమ్ అనే పుస్తకం రాశారు.
- వృత్తిపరమైన సేవల పరస్పర వినిమయాన్ని జజ్మాని వ్యవస్థ అంటారు.
- ఒక సమాజంలో వ్యక్తుల మధ్య ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి ఆ సమాజంలోని వ్యక్తులు ఒకరికొకరు వృత్తిపరమైన సేవలను అందజేస్తుంటారు.
- ఈ విధానంలో సేవలను అందించే వ్యక్తిని ‘కామిన్’ అంటారు.
- ఈ వ్యవస్థ భారతదేశంలో గ్రామీణ సమాజంలో ఉండేది.
సామాజిక నిర్మితి
- సమాజంలో సామాజిక సంస్థలు సముదాయాలు, సమూహాలు, వ్యక్తులు ఉంటారు. వ్యక్తులు విభిన్న ప్రమాణాలు పాటిస్తూ, విభిన్న పాత్రలు నిర్వహిస్తూ, విభిన్న సామాజిక అంతస్తులను కలిగి విభిన్న సామాజిక సంబంధాలను ఏర్పరుచుకుంటారు. దీన్నే సామాజిక నిర్మితి అని చెప్పవచ్చు.
సమాజంలోని సమూహాలు రెండు రకాలుగా ఉంటాయి.
1) ప్రత్యక్ష సమూహాలు
2) పరోక్ష సమూహాలు
ఉదా: కుల సమూహాలు, మత సమూహాలు, గిరిజన సమూహాలు
సమాజం – సముదాయం: కొన్ని సమూహాలు కలిసి సముదాయం ఏర్పడుతుంది.
ఉదా: గ్రామీణ సముదాయం, పట్టణ సముదాయం, గిరిజన సముదాయం
సంస్థలు
ఉదా: 1) విద్యా సంస్థ
2) రాజకీయ సంస్థ
3) ఆర్థిక సంస్థ
- సమాజంలోని సంస్థలు కొన్ని శాశ్వతంగా ఉంటాయి. కొన్ని తాత్కాలికంగా ఉంటాయి.
శాశ్వత సామాజిక సంస్థలు : ఇవి ఉమ్మడి లక్ష్యం, కొన్ని ప్రత్యేక నియమాలు కలిగి ఉంటాయి. - ఇవి ఒక తరం నుంచి మరొక తరానికి దీర్ఘకాలికంగా కొనసాగుతాయి.
- ఇవి వ్యక్తి అంతర్గత, బహిర్గత ప్రవర్తనను నియంత్రిస్తూ ఉంటాయి.
- కింది వాటిని సామాజిక సంస్థలు అంటారు.
- కుల సంస్థ, మత సంస్థ, బంధుత్వం, వివాహం, కుటుంబం, రాజకీయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ.
మెగస్తనీస్ అనే విదేశీ రాయబారి భారతీయ సమాజంలో ఏడు వర్గాలు ఉన్నాయని తెలియజేశాడు. అవి
1) తత్వవేత్తలు
2) గృహ యజమానులు
3) పశుపాలకులు, వేటగాళ్లు
4) వ్యాపారస్థులు, శారీరక శ్రమ చేసేవారు
5) యుద్ధం చేసేవాళ్లు
6) తనిఖీదారులు
7) మంత్రులు, సలహాదారులు, కన్వీనర్లు
ఆనాటి సమాజంలో వృత్తులు మార్చుకోవడానికి వీలులేదు. అంటే సామాజిక గమనశీలత లేదు.
భిన్నత్వంలో ఏకత్వం : భారతదేశ సమాజంలో విభిన్న భాషలు, మతాలు, జాతులు, సంస్కృతులు, భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. దీన్నే భిన్నత్వంలో ఏకత్వం అంటారు.
- 1962 జనాభా లెక్కల ప్రకారం 1652 భాషలున్నాయి.
- వీటిలో 23 భాషలు మాత్రమే 97 శాతం ప్రజలు మాట్లాడుతున్నారు.
- రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో భాషలను పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం 22 అధికార భాషలున్నాయి.
ప్రాచీన భాష హోదా
తమిళనాడు -2004
కన్నడ, తెలుగు -2008
మలయాళం -2013
ఒరియా – 2014
దేశంలో ఉన్న 4 ప్రధాన భాషా కుటుంబాలు
1) ఇండో ఆర్యన్ భాషా కుటుంబం : 70 శాతం ప్రజలు ఈ భాషను మాట్లాడతారు.
ఉదా: హిందీ
2) ద్రవిడ భాషా కుటుంబం : 25 శాతం ప్రజలు ఈ భాషను మాట్లాడతారు.
ఉదా: తెలుగు, తమిళం, సంస్కృతం
3) ఇండో యూరోపియన్ భాషా కుటుంబం : 1.3 శాతం ప్రజలు మాట్లాడతారు.
4) సినోటిబెటన్
- భారతదేశ సమాజాన్ని 12 భాషా ప్రాంతాలుగా గుర్తించారు. భాషా శాస్త్రవేత్త గ్రియర్సన్ ప్రకారం 179 భాషలు, 54 మాండలిక భాషలు మనదేశంలో ఉన్నాయి.

- 2022 నుంచి 2032 వరకు స్థానిక తెగల, భాషల దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
- భారతీయ సమాజం కుటుంబ వ్యవస్థ
- నంబూద్రి తెగలు కుటుంబాన్ని ఇల్లం అని పిలుస్తారు. ఉమ్మడి కుటుంబంలో ఇంటి పెద్దను కర్త అంటారు.
నంబూద్రిలో ఇంటి పెద్దను కర్ణవన్ అని పిలుస్తారు.
మితాక్షర సంప్రదాయం: వీటి ప్రకారం పుట్టుకతోనే ఆస్తికి వారసుడు అవుతాడు. తల్లిదండ్రులు జీవించి ఉండగానే పిల్లలు వారి ఆస్తులు పొందడం అనే సంప్రదాయం భారతదేశం అంతటా ఉన్నది. కానీ స్త్రీలకు ఆస్త్తి హక్కులేదు. దీనినే మితాక్షర సంప్రదాయం అంటారు.
కానీ అస్సాం, బెంగాల్లో ఈ సంప్రదాయం లేదు.
దయాభాగ సంప్రదాయం : తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మాత్రమే తల్లిదండ్రుల ఆస్తి వారసులకు వస్తుంది. ఈ సంప్రదాయంభారతదేశంలో కేవలం అస్సాం,బెంగాల్లో మాత్రమే ఉంది.
సర్వాత్మవాదం (Animatisam): దీన్ని ఇ.బి. టేలర్ ప్రతిపాదించారు. ఈ వాదం ప్రకారం ఆత్మనే శక్తి అని నమ్ముతారు. మనిషికి రెండు
ఆత్మలుంటాయి. అవి
1) స్వేచ్ఛగా తిరిగే ఆత్మ
2) శరీరంలో ఉండే ఆత్మ
భిన్నత్వంలో ఏకత్వం
వైవిధ్యం అంటే వివిధ జాతులు, మతాలు, భాషలు, కులాలు, సంస్కృతులు. యూనిటీ అనే పదానికి ఏకీకరణ అని అర్థం. భిన్నత్వంలో ఏకత్వం అంటే ప్రాథమికంగా ఏకత్వం లేని ఏకత్వం, విచ్ఛిన్నం లేని వైవిధ్యం అని అర్థం. వైవిధ్యం మానవ పరస్పర చర్యను సుసంపన్నం చేస్తుందనే భావనపై ఇది ఆధారపడి ఉంటుంది. భారతదేశం గొప్ప సాంస్కృతిక వైవిధ్యం కలిగిన దేశం అని చెప్పినపుడు ఇక్కడ అనేక రకాల సామాజిక సమూహాలు, సంఘాలు నివసిస్తున్నాయని అర్థం. అవి భాష, మతం, జాతి, కులం, విభాగం వంటి సాంస్కృతిక గుర్తుల ద్వారా నిర్వహించే సంఘాలు.
కుల భిన్నత్వం
- ఇండియాలో భిన్నత్వం ఉన్నప్పటికీ ఏకత్వంతో ఉన్నారు.
- కుల భిన్నత్వం, మత విభిన్నతలో ఏకత్వానికి ఉదాహరణ పుణ్యక్షేత్రాలు వేములవాడ, కొమురవెల్లి, రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గా, జాన్ పహాడ్ దర్గా (సూర్యాపేట), జహంగీర్ పేట్ (హైదరాబాద్) అదే విధంగా పీర్ల పండుగను హిందువులు, ముస్లింలు కలిసి జరుపుకొంటారు.
- రాజ్యాంగం ప్రకారం భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ: ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, ఉమ్మడి పౌరస్మృతి అనేవి దేశమంతటా ప్రజలందరికీ ఒకే విధంగా అమలు చేస్తున్నారు.
జాతుల భిన్నత్వం
జాతి అంటే ఒకే రకమైన భౌతిక లక్షణాలు, శరీరం రంగు, నాసిక నిర్మాణం, కేశాల రూపు మొదలైన లక్షణాలు గల వ్యక్తుల సమూహాన్ని జాతి అంటారు.
- భారతదేశ సమాజం వివిధ జాతుల ప్రదర్శన శాల – వి.ఎ. స్మిత్
- జనాభా లెక్కలు 1931 హట్టన్, బి.ఎస్.గుహ జాతులపై అధ్యయనం చేశారు.
- డి.ఎన్. మజుందార్, హట్టన్, బి.ఎస్.గుహ ప్రకారం జాతుల వర్గీకరణ ప్రాంతాలవారీగా కింది విధంగా ఉంది.
1) ఉత్తర , ఈశాన్య మండలి
2) కేంద్ర, మధ్య మండలి
3) దక్షిణ మండలి - బి.ఎస్.గుహ ప్రకారం భారతదేశంలో ఆరు రకాల జాతులున్నాయి. అవి 1) నీగ్రిటోస్
- భౌగోళిక శాస్త్రవేత్తల ప్రకారం వీరు భారతదేశంలోని తొలి ఆక్రమణదారులు
- అలాగే నీగ్రోయిడ్ ప్రజలు ఆఫ్రికా నుంచి భారతదేశానికి వలస వచ్చి భారతదేశ గడ్డపై తమ భాషను స్థాపించారని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ లక్షణాలు ముఖ్యంగా అండమాన్ ద్వీపవాసులు, నీలగిరి కొండల్లోని ఉదాలిస్, కొచ్చిలోని కడోర్స్, పళని కొండల పుల్లయన్లు మొదలైన వారిలో కనిపిస్తాయి.
- ఈశాన్య ప్రాంతంలోని అంగామి నాగాలు, జార్ఖండ్లోని రాజ్మహల్ హిల్స్లోని బాద్గీలు వంటి గిరిజనులు ఈ లక్షణాలను కలిగి ఉన్నారు.
- పొట్టి, ముదురు గోధుమ వర్ణ చర్మం, ఉన్ని జుట్టు, ఉబ్బిన నుదురు, విశాలమైన చదునైన ముక్కు, కొద్దిగా పొడుచుకు వచ్చిన దవడలతో ముఖం ఉంటుంది.
2) ప్రోటో ఆస్ట్రాలాయిడ్స్
- వీరు నీగ్రిటోస్ తర్వాత తూర్పు మధ్యధరా ప్రాంతం (పాలస్తీనా) నుంచి భారతదేశానికి వచ్చారని నమ్ముతారు. ప్రస్తుతం వారు మధ్య దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో జానాభాలో ఎక్కువ మంది ఉన్నారు.
- వెడ్డలు, ఇరులు, షోలగాలు వారి నిజమైన ప్రతినిధులు. మధ్య భారతదేశంలోని ఎత్తయిన ప్రాంతాల్లోని భిల్లులు, కొలిలు, బడగలు, కోర్వాలు, ముండాలు, భుమ్జీలు, దక్షిణ భారతదేశంలోని చెంచులు, కురుంబలు, మలయన్లు, యెరువాలు వీరందరిని కూడా వారి ప్రతినిధులుగా పరిగణించవచ్చు.
- కొంతమంది ఆంత్రోపాలజిస్ట్ల ప్రకారం ఈ వ్యక్తులు వారి రాకతో నీగ్రిటోలను నెట్టివేసి స్థాన భ్రంశం చేసి మరింత చేరుకోలేని మారుమూల తక్కువ ఆతిథ్యం ఇచ్చే ప్రాంతాలకు మార్చారు. అక్కడ వారు ఈ నాటికీ కనిపిస్తారు.
- భౌతిక రూపంలో, వారు ఉన్ని జట్టును మినహాయించి నీగ్రిటోలను పోలి ఉంటారు.
- వారి ఇతర భౌతిక లక్షణాలు: ఉబ్బెత్తుగా ఉన్న నుదురు, విశాలమైన చదునైన ముక్కు, కొద్దిగా పొడుచుకు వచ్చిన దవడలు కలిగి ఉంటారు.
3) మంగోలాయిడ్
- మంగోలాయిడ్ జాతికి చైనా మాతృభూమి అని నమ్ముతారు. ఇక్కడి నుంచి వారు మలయా ద్వీపకల్పం, ఇండోనేషియాలోని దక్షిణం వైపునకు నెట్టబడ్డారు.
- వారు ఉత్తర, తూర్పు పర్వతాల్లోని కనుముల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారు.
- ప్రస్తుతం వారు లడఖ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, తూర్పు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద ప్రాంతాలను ఆక్రమించారు.
వారి శారీరక లక్షణాలు గుండ్రంగా, వెడల్పుగా ఉండే తల, చాలా ఎత్తుగా ఉన్న చెంప, దవడ ఎముకలు, పొడవాటి చదునైన ముక్కు, ముఖం, శరీరంపై కొద్దిగా లేదా జట్టు లేకుండా ఉంటారు. - గారో, ఖాసీ, జైంతియా, లెప్చాస్, చక్మాస్, నాగా తెగలు ఈ జాతికి చెందినవి.
వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి
ఎ) పాలియో- మంగోలాయిడ్లు: వీరు భారతదేశానికి వచ్చిన మంగోలాయిడ్లలో మొదటివారు. ఈ ప్రజలు ప్రధానంగా హిమాలయాల సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరు ఎక్కువగా అస్సాం, దాని పక్క రాష్ర్టాల్లో కనిపిస్తారు.
బి) టిబెటో-మంగోలాయిడ్లు: ఈ ప్రజలు టిబెట్ నుంచి వచ్చారు. ప్రధానంగా భూటాన్, సిక్కిం, వాయవ్య హిమాలయాల ప్రాంతాలు, లడఖ్, బాల్చిస్థాన్లో చేర్చిన హిమాలయాలకు వచ్చి స్థిరపడ్డారు.
4) మెడిటేరియన్లు
- ఈ జాతి తూర్పు మధ్యధరా ప్రాంతం లేదా నైరుతి ఆసియా నుంచి భారతదేశానికి వచ్చింది. వారి శారీరక లక్షణాలు మధ్యస్థ పొట్టి తనాన్ని, ముదురు రంగు చర్మం, పొడవాటి తల కలిగి ఉంటారు.
- మొదట ఉత్తర-పశ్చిమ భారతదేశంలో స్థిరపడ్డారు. అక్కడ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. తదుపరి వలసదారుల ద్వారా వారు మధ్య, దక్షిణ భారతదేశంలోకి నెట్టబడ్డారు.
- ప్రస్తుతం వారు దక్షిణ భారతదేశంలోని జనాభాలో ఎక్కువ భాగం, ఉత్తర భారతదేశంలో గణనీయమైన నిష్పత్తిలో ఉన్నారు.
బి.పురుషోత్తం రెడ్డి
ఫ్యాకల్టీ, ఏమర్స్ విల్
9030925817
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






