26న ఎడ్సెట్
– హాజరుకానున్న 38 వేల మందికిపైగా విద్యార్థులు
– ఒకేరోజు 3 విడతల్లో పరీక్ష
తెలుగు రాష్ట్రాల్లో ఎడ్సెట్ ఈ నెల 26న నిర్వహించనున్నారు. తెలంగాణలో 39, ఏపీలోని కర్నూల్, విజయవాడలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 38,091 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. రెండు గంటల పాటు నిర్వహించే ఈ పరీక్షను ఒకేరోజు మూడు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షాకేంద్రాల్లోకి అనుమతించబోమని కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను https:// edcet.tsche.ac. in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు.
సెషన్ల వారీగా హాజరయ్యే విద్యార్థులు
సెషన్ హాజరయ్యే విద్యార్థులు
మొదటి సెషన్ 12,634
రెండో సెషన్ 12,732
మూడో సెషన్ 12,725
మొత్తం 38,091
పరీక్ష సమయాలు
మొదటి సెషన్ -ఉదయం 9 గంటల నుంచి 11 గంటలు
రెండో సెషన్ -మధ్యాహ్నం 12 : 30 గంటల నుంచి 2 : 30 గంటలు
మూడో సెషన్ – సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక