National Current Affairs | జాతీయం
డిజిటల్ పేమెంట్స్
డిజిటల్ ట్రాన్జాక్షన్లలో భారత్ మొదటి స్థానంలో ఉంది. జూన్ 11న విడుదలైన మైగవ్ ఇండియా డేటా సమాచారం ప్రకారం 2022లో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా రియల్ టైమ్ చెల్లింపుల్లో భారత్ 46 శాతం వాటాను సాధించింది. భారత్లో జరిగినన్ని లావాదేవీలు మరే దేశంలోనూ జరగలేదు. 29.2 మిలియన్ల లావాదేవీలతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా.. 17.6 మిలియన్లతో చైనా మూడో స్థానంలో ఉంది. థాయిలాండ్ (16.5 మిలియన్లు) 4, దక్షిణ కొరియా (8 మిలియన్లు) 5వ స్థానాల్లో ఉన్నాయి.
సంశోధక్
యుద్ధనౌక ‘సంశోధక్’ను చెన్నైలోని కట్టుపల్లిలో జూన్ 13న సముద్రంలోకి ప్రవేశపెట్టారు. ఇది ఇండియన్ నేవీ కోసం ఎల్అండ్టీ/జీఆర్ఎస్ఈ నిర్మించిన సర్వే వెజెల్స్ (లార్జ్) (ఎస్వీఎల్) ప్రాజెక్టులోని నాలుగో నౌక. సంశోధక్ అంటే పరిశోధకుడు అని అర్థం. 110 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు, 3,400 టన్నుల బరువుతో ఎస్వీఎల్ నౌకలను తయారు చేశారు. వీటిలో మొదటి మూడు నౌకలు సంధాయక్ (2021, డిసెంబర్ 5), నిర్దేశక్ 2022, మే 26), ఇక్షక్ (2022 నవంబర్ 22).
గబాన్ సెజ్
గబాన్ దేశ మొదటి అగ్రి సెజ్ ప్రాజెక్టును ఢిల్లీలో ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూన్ 14న ప్రారంభించారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్కు సంబంధించిన ఈ ప్రాజెక్టును సెంచూరియన్ యూనివర్సిటీ, ఏవోఎం భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. భారత్-ఆఫ్రికా మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, సహకారాన్ని పెంపొందించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు