A Brief History of Railways | రైల్వేల సంక్షిప్త చరిత్ర

-దేశంలో రైల్వేలను నాటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ కాలంలో 1853 ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారు.
-మొదటి రైలు బొంబాయి-థానేల మధ్య 34 కి.మీ. దూరం, 14 బోగీలతో, 400 మంది ప్రయాణికులతో గంట పదిహేను నిమిషాలపాటు 1853 ఏప్రిల్ 16న ప్రయాణం చేసింది.
-హైదరాబాద్ రాష్ట్రంలో 1873 నాటికి నిజాంస్టేట్ రైల్వే వ్యవస్థ కొలువు తీరింది. మొదటి రైల్వే లైను 1874, జూలై 14న గుల్బర్గా నుంచి సికింద్రాబాద్కు ప్రారంభమైంది.
-1907లో నాంపల్లి రైల్వే స్టేషన్ 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్ను నిర్మించారు.
-భారతీయ రైల్వేల నినాదం జాతి జీవన రేఖ
-1951లో భారతీయ రైల్వేలను ప్రభుత్వం జాతీయం చేసింది.
-భారతీయ రైల్వేలు 150 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా 2002 ఏప్రిల్ 16న భోలు ది గార్డ్ మస్కట్ను విడుదల చేసింది.
-ప్రపంచంలో పొడవైన రైలు ప్లాట్ఫాం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉంది. దీని పొడవు 1.3 కి.మీ.
-ప్రపంచ రైల్వే నెట్వర్క్లో అమెరికా (2,28,218 కి.మీ.), చైనా (1,21,000 కి.మీ.), రష్యా (87,157కి.మీ.), భారత్ (65,408 కి.మీ.), కెనడా (46,552 కి.మీ.) వరుస స్థానాల్లో ఉన్నాయి.
-దేశంలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉన్నాయి. వాటిలో అతిపెద్దది ఉత్తర రైల్వేజోన్ (6,968 కి.మీ.), అతి చిన్న జోన్ తూర్పు రైల్వే (2,414 కి.మీ.)
-దేశంలో ప్రయాణించే మొత్తం రైళ్లు 21 వేలు. ఇవి ప్రతి రోజు 13.4 లక్షల కి.మీ. ప్రయాణం చేస్తాయి.
-అత్యధిక దూరం ప్రయాణం చేసే రైలు వివేక్ ఎక్సెప్రెస్. ఇది కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు నడుస్తుంది. ఇది 110 గంటల్లో 4,273 కి.మీ. ప్రయాణం చేస్తుంది.
-దేశంలో అత్యల్ప దూరం (3 కి.మీ.) ప్రయాణించే రైలు నాగపూర్-అజ్నీ ప్యాసింజర్ రైలు.
-దేశంలో అత్యధిక వేగంగా ప్రయాణం చేసే రైలు గతిమాన్ (గంటకు 160 కి.మీ. వేగంతో) న్యూఢిల్లీ – ఆగ్రా మధ్య నడుస్తుంది.
-దేశంలో అత్యల్ప వేగంగా ప్రయాణం చేసే రైలు నీలగిరి ప్యాసింజర్. ఇది మెట్టుపాలెం-ఊటీ మధ్య నడుస్తుంది. ఇది గంటకు 10 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
దేశంలో నాలుగు మూలల్లో ఉన్న రైల్వే స్టేషన్లు
-ఉత్తరం – బారాముల్లా (జమ్ముకశ్మీర్)
-దక్షిణం – కన్యాకుమారి (తమిళనాడు)
-తూర్పు – లెడో (అసోంలోని తీన్ సుకాడియాలో)
-పడమర – నలియా (గుజరాత్లోని భుజ్ సమీపంలో)
యునెస్కో వరల్డ్ హెరిటేజ్
-యునైటెడ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (జల్పాయిగురి-డార్జిలింగ్), నీలగిరి మౌంటెన్ రైల్వే (నీలగిరి కొండలు), ఛత్రపతి శివాజీ టెర్మినస్ (ముంబై), కల్కా-సిమ్లా రైల్వే (హిమాచల్ప్రదేశ్లోని శివాలిక్ పర్వత శ్రేణులు)కు స్థానం లభించింది.
-రైల్వే పింక్ బుక్: భారతీయ రైల్వేల ఆదాయ, వ్యయ కేటాయింపు వివరాలను నమోదు చేసే సంస్థ.
ఇండియన్ రైల్వే-గణాంకాలు
ఉద్యోగులు -18 లక్షలు
రెవెన్యూ -రూ. 1,63,450 కోట్లు
రైళ్లు -12,617 (ప్రతిరోజు)
గూడ్స్ బండ్లు -7,421 (ప్రతిరోజు)
ప్రయాణికులు -23 లక్షలు (ప్రతిరోజు)
రవాణా -దేశ ఉత్పత్తిలో మూడింట ఒక వంతు
ఉత్పత్తి సంస్థలు -12
ఇంధన ఖర్చు -రూ. 12,635 కోట్లు (2014-15 విద్యుత్) రూ. 18,586 కోట్లు (2014-15 డీజిల్)
రైలు మార్గం పొడవు -65,000 కి.మీ.
స్వాతంత్య్రం వచ్చాక -11,000 కి.మీ.
స్టేషన్లు -7,172
RELATED ARTICLES
-
English Grammar | We should all love and respect
-
Groups Special – Science | సహజ శక్తి అనంతం … కాలుష్య రహితం.. పర్యావరణ హితం
-
Economy – Groups Special | అండమాన్లో అల్పం… దాద్రానగర్లో అధికం
-
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
-
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?
-
DSC Special – Biology | Autogamy..Geitonogamy.. Xenogamy
Latest Updates
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
Physics – IIT/NEET Foundation | The acceleration of a body has the direction of
Groups Special – Polity | ఎలక్టోరల్ కాలేజీతో ఎంపిక.. మహాభియోగంతో తొలగింపు
Current Affairs | ఏ రాష్ర్టానికి చెందిన ‘మట్టి బనానా’కు జీఐ ట్యాగ్ లభించింది?
DSC Special – Social | భారతదేశంలో ఇనుప ఖనిజం లభించే ప్రాంతం?
Economy | పశువైద్య సేవా సౌకర్యాలను అందించే టోల్ ఫ్రీ నంబర్
Indian Culture And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
General Studies – Groups Special | ఆదిత్య-ఎల్ 1 మిషన్
IELTS Exam | Language Tests for Overseas Education