కొత్త రికార్డు దిశగా టీఎస్ఎల్పీఆర్బీ
– ఈ నెల 28న ఏకంగా 6.5 లక్షల మందికి ప్రిలిమ్స్
ఈ నెల 28 నిర్వహించనున్న కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షతో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) కొత్త రికార్డు నమోదు చేయబోతున్నది. స్వరాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగార్థులకు పోటీ పరీక్ష నిర్వహించిన ఘనతను సొంతం చేసుకోనున్నది. గతంలో పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో భాగంగా 5.80 లక్షల మంది అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత అంత పెద్ద సంఖ్యలో 6.5 లక్షలు మంది అభ్యర్థులు హాజరుకానున్న పరీక్షగా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రికార్డు నెలకొల్పనున్నది. ఈ పరీక్షకు 1,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు టీఎస్ఎల్పీఆర్బీ వర్గాలు తెలిపాయి. పోలీ స్ శాఖలోని
మొత్తం 15,644 కానిస్టేబుల్ పోస్టులు, రవాణాశాఖలో 63 కానిస్టేబుల్, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకుగాను మొత్తం 6,50,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. వాస్తవానికి ఈ పరీక్షను ఈ నెల 21న నిర్వహించాల్సి ఉన్నప్పటికీ 28కి వాయిదాపడింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ విధానంలోనే హాజరు తీసుకోనున్నారు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక