Current Affairs March 15th | క్రీడలు
ఇరానీ కప్
ఇరానీ కప్ను రెస్టాఫ్ ఇండియా జట్టు గెలుచుకుంది. మార్చి 5న గ్వాలియర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా జట్టు మధ్యప్రదేశ్పై 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ (రెస్టాఫ్ ఇండియా)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
పీవీఎల్
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) రెండో సీజన్లో అహ్మదాబాద్ జట్టు ట్రోఫీని గెలుచుకుంది. మార్చి 5న కొచ్చిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అహ్మదాబాద్ 3-2తో బెంగళూరు టార్పెడోస్పై విజయం సాధించింది.
షాన్ మార్ష్
ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ షాన్ మార్ష్ ఫస్ట్క్లాస్ క్రికెట్, అంతర్జాతీయ వన్డేలకు మార్చి 10న రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ టీ20ల్లో కొనసాగనున్నాడు. 2001లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2019లో టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 2,265, వన్డేల్లో 2,773 పరుగులు చేశాడు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు