ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
-21న కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్ష
– షెడ్యూల్ను విడుదల చేసిన టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు
యూనిఫాం సర్వీసెస్ పోస్టుల భర్తీలో మొదటి ప్రక్రియ ప్రారంభమైంది. సబ్ ఇన్స్పెక్టర్, తత్సమాన పోస్టులకు ఆగస్టు 7 (ఆదివారం)న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్బీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు ప్రిలిమ్స్ ఆగస్టు 21న ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు నిర్వహిస్తామని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్టికెట్లను టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్ ‘www.tslprb.in’ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఎస్సై ప్రిలిమ్స్ వివరాలు
ఎస్సై తత్సమాన పోస్టులు 554
హాజరవుతున్న అభ్యర్థులు సుమారు 2,45,000
హాల్ టికెట్ల జారీ జూలై 30 నుంచి
రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 20 పట్టణాల్లో
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ వివరాలు
సివిల్ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులు 15,644
ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులు: 63
ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు:614
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 40 పట్టణాల్లో..
హాజరవుతున్న అభ్యర్థులు సుమారు 6,50,00
హాల్ టికెట్ల జారీ: ఆగస్టు 10 నుంచి
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు