రైతులకు కష్టాలు పోతాయి
- టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు
సీఎం కేసీఆర్ సత్తా ఉన్న నాయకుడు. అపారమైన రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఎనిమిదేండ్లలోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకువచ్చి దేశంలోని ఇతర రాష్ర్టాలకు మోడల్గా నిలిపారు. సంపదను సృష్టించడం, తిరిగి ఆ సంపదను ప్రజలకు పంచడంతోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇలాంటి లీడర్ జాతీయ రాజకీయాల్లో ఉంటే దేశం ప్రగతి పథంలో దూసుకెళ్తుంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రెండు దశాబ్దాల పాటు వెన్నంటే ఉండడం, దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ అడుగు పెడుతున్న వేళ ఈ చారిత్రక ఘట్టంలో నేను ఒక సైనికుడిగా ఉండడాన్ని గర్విస్తున్నా. జాతీయ రాజకీయాల్లోకి రాకముందే రైతులను ముంచే నల్లచట్టాలపై ఢిల్లీ కేంద్రంగా నిరసన తెలిపి దేశవ్యాప్తంగా రైతంగానికి తోడుగా నిలిచారు. రైతుల గురించి నిరంతరం ఆలోచించే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతల కష్టాలు దూరమవుతాయని గట్టిగా నమ్ముతున్నాము. కేసీఆర్ దేశ్కీ నేతగా మారితేనే బాగుంటుంది.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?