-వాల్మీకి అంబేద్కర్ అవాస్ యోజన (వాంబే)
-ఈ పథకాన్ని 2001, ఆగస్టు 15న ప్రారంభించారు. పట్టణాల్లోని మురికివాడల్లో బీపీఎల్ కుటుంబాల కోసం, నివాసాలు లేని పేదల కోసం దీన్ని ప్రారంభించారు. ఈ పథకం అర్బన్ డెవపల్మెంట్ శాఖ పరిధిలోనిది.
-మురికివాడల్లో నివసించే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితుల్లో నివాసాల ఏర్పాటు ఈ పథక ప్రధాన లక్ష్యం.
-ఈ పథకం కింద కేంద్రం 50 శాతం సబ్సిడీని, మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి.
-అందరికి ఇండ్లు (షెల్టర్ ఫర్ ఆల్) అనే నినాదంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
-దీనిలో భాగంగా మురికివాడల్లో నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద టాయిలెట్లను ఏర్పాటు కూడా చేస్తారు.
-ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, వెనుకబడిన తరగతులకు 30 శాతం, ఇతర వెనుకబడినవర్గాలకు 15 శాతం, పీహెచ్సీలకు 15 శాతం కేటాయిస్తారు.
-వాంబే కింద గరిష్టంగా రూ. 40 వేలతో నిర్మాణాన్ని చేపట్టాలి. దీనిలోనే శానిటరీ టాయిలెట్ కూడా రావాలి. పది లక్షల జనాభా దాటిన పట్టణాల్లో దీనికోసం రూ. 50 వేలు కేటాయిస్తారు.
-ఈ పథకానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ను తయారుచేయడానికి కేంద్రం స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎస్యూడీఏ)ని భాగస్వామ్యం చేసింది.
Did you know ..! ఇది తెలుసా..!
Previous article
Sociology | హిందూ సామాజిక వ్యవస్థకు బలమైన పునాది?
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






