మన విద్యార్థులకు ఐఎస్బీ కోర్సులు
ప్రతిష్ఠాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ) ఆధారంగా తెలంగాణ విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఐఎస్బీ అధికారులతో తొలిదఫా చర్చలు జరిపారు. ఇందులో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి, పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్రాథోడ్ పాల్గొన్నారు. ఐఎస్బీలో గ్లోబల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్లోబల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ ఆపరేషన్స్ అండ్ సప్లయ్ చైన్ వంటి నాలుగు ఆన్లైన్ కోర్సులను నిర్వహిస్తున్నారు. జాబ్ ఓరియంటెడ్ కోర్సుల్లో డిగ్రీ, పీజీ విద్యార్థులను చేర్పించేందుకు ఐఎస్బీతో త్వరలోనే ఎంవోయూను కుదు ర్చుకోనున్నారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని వర్సిటీల వీసీలతో సమావేశం నిర్వహించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






