15 నుంచి తొలిమెట్టు
23,179 సర్కారీ బడుల్లో నిర్వహణ
తరగతుల వారీగా విద్యాప్రమాణాల రూపకల్పన
నేటితో ఉపాధ్యాయులకు ముగియనున్న శిక్షణ
పాఠశాల విద్యాశాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రాథమికస్థాయి విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను సాధించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన తొలిమెట్టు ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని 23,179 సర్కారీ బడుల్లో ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో తరగతుల వారీగా సాధించాల్సిన విద్యాప్రమాణాలను ఎస్సీఈఆర్టీ అధికారులు రూపొందించారు. 1, 2వ తరగతులకు నాలుగు విద్యాప్రమాణాలు, 3,4, 5వ తరగతులకు ఆరు విద్యాప్రమాణాలను లక్ష్యంగా విధించారు. వీటిని పిల్లలు సాధించేలా ఏడాదిపాటు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. 140 రోజులపాటు తొలిమెట్టు అమలు చేయనున్నారు.
టీచర్లకు శిక్షణ పూర్తి
తొలిమెట్టు కార్యక్రమంలో టీచర్ల పాత్ర ముఖ్యమైనది. అందుకే టీచర్లకు మూడు విడతల్లో శిక్షణ ఇచ్చారు. జూలై 30 నుంచి ఆగస్టు 2 వరకు మొదటి విడత, ఆగస్టు 3 నుంచి 6 వరకు రెండో విడత, ఆగస్టు 8 నుంచి 11 వరకు మూడో విడత శిక్షణను పూర్తి చేశారు.
1,2 తరగతుల విద్యా ప్రమాణాలు
# వినడం, మాట్లాడటం
# చదవడం, రాయడం
# సృజనాత్మకత
3, 4, 5 తరగతుల విద్యా ప్రమాణాలు
# వినడం, ఆలోచించి మాట్లాడటం
#ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం
#ఆలోచించి సొంత మాటల్లో రాయడం (స్వీయ రచన)
# పదజాలం, సృజనాత్మకత/ ప్రశంస
# భాషను గుర్తించి తెలుసుకోవడం
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?