జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు
-పరీక్షలో మాస్ కాఫీయింగ్
-పోలీసుల విచారణలో నిర్ధారణ
-181 మందికి అందిన జవాబులు
-త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ
-సీఎండీ రఘుమారెడ్డి ప్రకటన
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో వెయ్యి జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది జులై 17న నిర్వహించిన రాత పరీక్షను రద్దు చేస్తున్నట్టు సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. కొంతమంది రాష్ట్ర విద్యుత్తు సంస్థ ఉద్యోగులు, ఇతరులు కలిసి సుమారు 181 మంది అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్టు రాచకొండ పోలీసుల విచారణలో తేలిందని వెల్లడించారు. ఈ వ్యవహారంలో మరింత మంది అభ్యర్థు ల ప్రమేయం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎండీ తెలిపా రు. రాతపరీక్షలో అక్రమాలపై కొంతమంది కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నాచేశారు. పరీక్షను రద్దు చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డ పలువురు విద్యుత్తు సంస్థల ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
RELATED ARTICLES
Latest Updates
మెదడు, శరీరభాగాలకు మధ్య సంధాన కర్తగా పనిచేసేది?
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో.. ఐడీబీఐ బ్యాంకులో 500 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
Union Bank Recruitment | యూనియన్ బ్యాంకులో 606 పోస్టులు
PNB Recruitment | పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 1025 పోస్టులు
IIT Tirupati Recruitment | తిరుపతి ఐఐటీలో ప్రొఫెసర్ పోస్టులు
PMBI Recruitment | పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NALCO Recruitment | నాల్కోలో జూనియర్ ఫోర్మెన్ పోస్టులు
TMREIS Adissions | మైనారిటీ స్కూల్స్లో ప్రవేశాలు
HCL Recruitment | హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
NPCIL Recruitment | ఎన్పీసీఐఎల్లో ట్రెయినీ పోస్టులు