జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు
-పరీక్షలో మాస్ కాఫీయింగ్
-పోలీసుల విచారణలో నిర్ధారణ
-181 మందికి అందిన జవాబులు
-త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ
-సీఎండీ రఘుమారెడ్డి ప్రకటన
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో వెయ్యి జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది జులై 17న నిర్వహించిన రాత పరీక్షను రద్దు చేస్తున్నట్టు సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. కొంతమంది రాష్ట్ర విద్యుత్తు సంస్థ ఉద్యోగులు, ఇతరులు కలిసి సుమారు 181 మంది అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్టు రాచకొండ పోలీసుల విచారణలో తేలిందని వెల్లడించారు. ఈ వ్యవహారంలో మరింత మంది అభ్యర్థు ల ప్రమేయం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎండీ తెలిపా రు. రాతపరీక్షలో అక్రమాలపై కొంతమంది కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నాచేశారు. పరీక్షను రద్దు చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డ పలువురు విద్యుత్తు సంస్థల ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






