23 నుంచి జేఈఈ మెయిన్.. అడ్మిట్ కార్డుల విడుదల
హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. జేఈఈ పరీక్షలు ఈ నెల 23 నుంచి 26 వరకు జరుగనున్నాయి.
విద్యార్థుల సౌలభ్యం కోసం ఎన్టీఏ మూడు వేరువేరు లింక్లను అందుబాటులో ఉంచింది. దీనిద్వారా అడ్మిట్ కార్డులను సులభంగా, వేగంగా డౌన్లోడ్ చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుందని తెలిపింది. కాగా, ఈ ఏడాదినుంచి జేఈఈ మెయిన్ పరీక్షను ఒకటికంటే ఎక్కువసార్లు రాసుకునే అవకాశం ఉన్నది. జేఈఈకి అర్హత సాధించాలంటే విద్యార్థులు 12 తరగతి పాసవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్ కోసం 6.60 లక్షల మంది విద్యార్థులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
వెబ్సైట్: jeemain.nta.nic.in.
- Tags
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?