23 నుంచి జేఈఈ మెయిన్.. అడ్మిట్ కార్డుల విడుదల

హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. జేఈఈ పరీక్షలు ఈ నెల 23 నుంచి 26 వరకు జరుగనున్నాయి.
విద్యార్థుల సౌలభ్యం కోసం ఎన్టీఏ మూడు వేరువేరు లింక్లను అందుబాటులో ఉంచింది. దీనిద్వారా అడ్మిట్ కార్డులను సులభంగా, వేగంగా డౌన్లోడ్ చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుందని తెలిపింది. కాగా, ఈ ఏడాదినుంచి జేఈఈ మెయిన్ పరీక్షను ఒకటికంటే ఎక్కువసార్లు రాసుకునే అవకాశం ఉన్నది. జేఈఈకి అర్హత సాధించాలంటే విద్యార్థులు 12 తరగతి పాసవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్ కోసం 6.60 లక్షల మంది విద్యార్థులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
వెబ్సైట్: jeemain.nta.nic.in.
- Tags
Latest Updates
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు
సంస్థానాలయుగం – తెలంగాణ సాహిత్యం
బహ్మనీలు..గోల్కండ కుతుబ్ షాహీలు
ముల్కీ ఉద్యమం మూలాలు
స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ఎప్పుడు?
ఓపెన్ ఇంటర్లో కొత్త కరిక్యులం
28న ఇంటర్ ఫలితాలు విడుదల
ఐడబ్ల్యూఎఫ్లో పోస్టుల భర్తీ
ఇన్కాయిస్ లో సైంటిస్ట్ పోస్టుల భర్తీ
ఇండియన్ ఆర్మీలో 458 పోస్టుల భర్తీ