కూ యాప్ ఏమిటి? మంత్రులు ఎందుకు చేరారు?

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్.. టిక్టాక్, పబ్జీ మొబైల్, షీఇన్ తదితర ప్రజాదరణ పొందిన చైనా యాప్లను నిషేధించింది. అదే సమయంలో విదేశీ యాప్లకు ప్రత్యామ్నాయంగా దేశీయంగా యాప్లను అభివ్రుద్ధి చేయడాన్ని ప్రోత్సహించింది. ఆత్మ నిర్బర్ భారత్ (స్వావలంభన భారత్)లో భాగంగా ట్విట్టర్కు దేశీయ ప్రత్యామ్నాయంగా అప్రమేయ రాధాకృష్ణ, ఆయన టీం .. కూ యాప్ను డెవలప్ చేసింది.
ఈ ప్రాజెక్టులో యాప్డెవలపర్ను ప్రోత్సహించిన కేంద్రం.. దాని తయారీ పూర్తయిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు ట్విట్టర్కు ప్రత్యామ్నాయంగా కూ యాప్లో సభ్యులుగా చేరడం మొదలైంది. కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్, ఐఏఎస్ అధికారి సోనల్ గోయల్ తదితరులు సభ్యులుగా చేరారు. మైట్ వై, ఇండియా పోస్ట్, మై గవ్ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా నూతన మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో సభ్యత్వం తీసుకున్నాయి.
బెంగళూరుకు చెందిన బాంబినేట్ టెక్నాలజీ సీఈవో అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదావట్కా గతేడాది మార్చిలోనే కూ యాప్ను అభివ్రుద్ధి చేశారు. కానీ పలువురు కేంద్ర అధికారులు నూతన ఇండియా యాప్లో ఖాతాలు తెరిచాక క్రమంగా వెలుగులోకి వచ్చింది ఈ యాప్. హిందీతోపాటు తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళ్, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒరియా, అస్సామీ తదితర భారత ప్రాంతీయ భాషల్లోనూ యూజర్లు పోస్ట్లు పెట్టేలా యాప్ రూపొందించారు.
- Tags
Latest Updates
దేహంలోని అతిచిన్న ఎముక దేనికి సహాయపడుతుంది?
‘Around’ & ‘About’ can be used to talk about…?
శాసనాల చరిత.. కాకతీయుల ఘనత
సుప్రీంకోర్ట్ ఏ కేసు సందర్భంగా ‘రాజ్యం’ వివరణను స్పష్టంగా పేర్కొన్నది?
సామాజిక రక్షణ..సాధారణ బీమా
ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్
ప్రజల సంక్షేమానికి జీడీపీ పరిమితులను వివరించండి?
గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సే
గ్రూప్ -1 కొట్టడం సులువే!
Top Cities and Universities in the USA