Did you know ..| ఇది తెలుసా..?
-ప్రాజెక్టు టైగర్
-దేశంలో అంతరించిపోతున్న పులులను సంరక్షించి వాటి సంఖ్యను పెంచేందుకు 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రాజెక్టు టైగర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
-ఈ కార్యక్రమాన్ని పలమావ్ టైగర్ రిజర్వులో ప్రారంభించారు.
-ఈ పథకాన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పర్యవేక్షిస్తుంది.
-అత్యంత అరుదైన బెంగాల్ పులులతోపాటు దేశవ్యాప్తంగా పులులు నివసించే ప్రాంతాలను రక్షించి, వేటగాళ్ల బెడదను అరికట్టడం ఈ పథకం ఉద్దేశం.
-వేటగాళ్లను అడ్డుకొనేందుకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది.
-టైగర్ రిజర్వులుగా ప్రకటించిన అడవుల్లో మానవ సంచారాన్ని తగ్గించేందుకు అక్కడి గ్రామాలను మైదానప్రాంతాలకు తరలించటం ఈ పథకంలో మరో కార్యక్రమం.
-ప్రభుత్వ చర్యలతో పులుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతూ వచ్చింది.
-2015, జనవరి 20న విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో పులుల సంఖ్య 2,226.
-20వ శతాబ్దంలో భారత్లో పులులు 20,000 నుంచి 40,000 మధ్య ఉండేవని అంచనా.
-1972లో మొదటిసారి నిర్వహించిన పులుల లెక్కింపులో దేశంలో కేవలం 1800 పులులు మాత్రమే ఉన్నాయని తేలింది.
-2015, జనవరి 20న విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో పులుల సంఖ్య 2,226.
-20వ శతాబ్దంలో భారత్లో పులులు 20,000 నుంచి 40,000 మధ్య ఉండేవని అంచనా.
-1972లో మొదటిసారి నిర్వహించిన పులుల లెక్కింపులో దేశంలో కేవలం 1800 పులులు మాత్రమే ఉన్నాయని తేలింది.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు