క్రీడలు 08-06-2022
ఐపీఎల్-2022
15వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. మే 29న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ప్రైజ్మనీ విజేత జట్టుకు రూ.20 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ.13 కోట్లు. ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) రూ.15 లక్షలు (బట్లర్, 863), పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) రూ.15 లక్షలు (చాహల్, 27). ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన ఏడో జట్టు గుజరాత్. రాజస్థాన్ రాయల్స్ (2008), దక్కన్ చార్జర్స్ (2009), చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011, 2018, 2021), సన్రైజర్స్ హైదరాబాద్ (2016), ముంబై ఇండియన్స్ (2013, 2015, 2017, 2019, 2020) విజేతలుగా నిలిచాయి.
డారెన్ సమీ
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డారెన్ సమీకి ‘సితారా-ఐ-పాకిస్థాన్’ అవార్డును మే 30న అందజేశారు. ఇది పాకిస్థాన్ ప్రదానం చేసే మూడో అత్యున్నత పౌర పురస్కారం. పాకిస్థాన్ క్రికెట్కు సేవలందించినందుకు సమీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. సమీ 2020లో అత్యున్నత పాకిస్థాన్ పౌర పురస్కారం ‘నిషాన్-ఎ-పాకిస్థాన్’ అందుకున్నాడు.
ఆసియా కప్ హాకీ
పురుషుల హాకీ కప్-2022 టోర్నీలో దక్షిణ కొరియా విజేతగా నిలిచింది. జూన్ 1న జకర్తాలోని జీబీకే స్పోర్ట్ ఎరెనాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియా మలేషియాను ఓడించి స్వర్ణం సాధించింది. భారత్ జపాన్ను ఓడించి కాంస్య పతకం గెలుచుకుంది. దక్షిణ కొరియా జట్టు ఆసియా కప్ను గెలవడం ఇది ఐదోసారి.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు