అటెండెన్స్ అక్కర్లేదు!

-కరోనా నేపథ్యంలో జేఎన్టీయూ నిర్ణయం.. పరీక్షల్లో చాయిస్ ప్రశ్నల కొనసాగింపు
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కనీస హాజరు శాతం నుంచి విద్యార్థులకు జేఎన్టీయూ మినహాయింపు ఇచ్చింది. హాజరుతో పనిలేకుండా జూలైలో నిర్వహించే బీటెక్, ఎంటెక్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ సెమిస్టర్ పరీక్షలకు విద్యార్థులను అనుమతించనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ వెల్లడించారు. గతంలో ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి. ఒకవేళ 65 శాతం హాజరు ఉంటే మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా 10 శాతం కలిపి పరీక్షలకు అనుమతించేవారు.
కరోనా నేపథ్యంలో నిరుడు కనీస హాజరు శాతం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ విద్యాసంవత్సరం కూడా అమలు చేసుకున్నారు. సెమిస్టర్ పరీక్షల్లో చాయిస్ ప్రశ్నలను సైతం కొనసాగించనున్నట్టు జేఎన్టీయూ ప్రకటించింది. తాజా విధానంలో 8 ప్రశ్నలకుగాను విద్యార్థులు ఏదేని ఐదు ప్రశ్నలు రాస్తే సరిపోతుందని తెలిసింది. కొవిడ్ మార్గదర్శకాలు అనుసరించే పరీక్షలు జరుగుతాయి.
- Tags
- Attendance
- Exams
- JNTU
RELATED ARTICLES
Latest Updates
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
Indian Polity | జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది?
Telangana Government Schemes | ప్రజల పాలిట వరాలు.. అభివృద్ధికి ప్రతీకలు
TS EAMCET | టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Current Affairs | దేశంలో అతిపెద్ద అక్వేరియం ఏ నగరంలో రానుంది?
MSTC Recruitment | ఎంఎస్టీసీ లిమిటెడ్లో 52 మేనేజర్ పోస్టులు
Telangana Current Affairs | షీ భరోసా సైబర్ ల్యాబ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
SSC CHSL Preparation 2023 | ఉమ్మడిగా చదివితే.. ఉద్యోగం మీదే!
GEOGRAPHY | పర్వతాల ఊయలగా వేటిని పేర్కొంటారు?
ISRO Recruitment | ఇస్రోలో 303 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు