బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
– 1 నుంచి 15 వరకు దరఖాస్తుల ఆహ్వానం
– ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన 30న
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ను డైరెక్టర్ సతీశ్కుమార్ గురువారం విడుదల చేశారు. టీఎస్ ఆన్లైన్, మీ సేవ కేంద్రాల admissions@rgukt.ac.in వెబ్ ద్వారా శుక్రవారం నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పీహెచ్, స్పోర్ట్, ఎన్సీసీ, క్యాప్ విద్యార్థులు జూలై 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ పాసైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులని తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను జూలై 30న విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొత్తం సీట్లలో 85 శాతం సీట్లకే నోటిఫికేషన్ ఇచ్చామని, ఆంధ్రప్రదేశ్తోపాటు ఓపెన్ క్యాటగిరికి చెందిన 15 శాతం సీట్లను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. మరో 75 సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులు రూ.1.36 లక్షలు చెల్లించి దరఖాస్తు ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. ఒకవేళ సీట్లు మిగిలితే తెలంగాణ, ఏపీ నుంచి పేమెంట్ సీట్లకు అవకాశం కల్పిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?