ఎమర్జింగ్ కోర్సుల్లో మరో 10 వేల సీట్లు!
ఇంజినీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటాసైన్స్, ఐవోటీ వంటి ఎమర్జింగ్ కోర్సులకు డిమాండ్ పెరుగుతుండటంతో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఆయా కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నాయి. కోర్ కోర్సులుగా పేరొందిన మెకానికల్, సివిల్, ఎలక్టికల్ కోర్సుల్లో సీట్ల సంఖ్యను తగ్గించి, ఎమర్జింగ్ కోర్సుల్లో పెంచుకొనేందుకు యాజమాన్యాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందుకు అనుమతులు కోరుతూ పలు యాజమాన్యాలు ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)కి దరఖాస్తు చేశాయి. ఆయా కోర్సులకు 2022-23 విద్యా సంవత్సరంలో అఫిలియేషన్ ఇవ్వాలని జేఎన్టీయూ హైదరాబాద్తో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి దరఖాస్తు పెట్టాయి.
ఏఐసీటీఈ అనుమతులు లభిస్తే రానున్న విద్యా సంవత్సరంలో ఎమర్జింగ్ కోర్సుల్లో మరో 10 వేల సీట్ల వరకు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. దీంతో ఎమర్జింగ్ కోర్సుల్లో మొత్తం సీట్ల సంఖ్య దాదాపు 30 వేలకు చేరుతుందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నట్టయితే కొత్త కోర్సులకు అనుమతులు ఇవ్వడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని, అఫిలియేషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉన్నదని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్హుస్సేన్ తెలిపారు. ఈ కోర్సులు పూర్తి చేసిన యువతకు సాఫ్ట్ వేర్ రంగంలో విస్తృత స్థాయిలో ఉద్యోగావకాశాలతో పాటు పాటు భారీ ప్యాకేజీలు లభిస్తున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?