ట్రిపుల్ఐటీ ప్రవేశాల జాబితా విడుదల
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీలో 2022-23 విద్యాసంవత్సరం ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదలైంది. మొత్తం 1,500 సీట్లకు 33,005 దరఖాస్తులు వచ్చాయి. 1,404 సీట్లు నిండాయి. ఈ జాబితాను సోమవారం వర్సిటీలో ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్ విడుదల చేశారు. మిగిలిన 96 సీట్లను స్పోర్ట్స్, పీహెచ్, క్యాప్తోపాటు 105 గ్లోబల్ క్యాటగిరి సీట్ల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని ఇన్చార్జి వీసీ తెలిపారు. మెరిట్ జాబితాలో 99 శాతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఎంపికయ్యారు. సీట్లు పొందినవారిలో బాలికలే అధికంగా ఉన్నారు.
జాబితాను admissions.rgukt.ac.inలో పెట్టారు. సీటు పొందిన విద్యార్థులకు ఈ నెల 28 నుంచి 30 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల వరకు దరఖాస్తులో పొందుపరిచిన సర్టిఫికెట్లతో కళాశాలలో హాజరు కావాల్సి ఉంటుంది.
Previous article
నిట్లో 99 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
Next article
6,61,196 మందికి కానిస్టేబుల్ ప్రిలిమ్స్
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?