1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని దేనికి ప్రథమ చర్యగా పేర్కొంటారు?
పాలిటీ
1. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి.
ఎ) బ్రిటన్ తరహాలో భారతదేశంలో
రెగ్యులర్ పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్
బి) రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా
కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు
సి) భారతీయ శిక్షాస్మృతి 1860లో అమల్లోకి వచ్చింది.
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి డి) ఎ, బి, సి
2. రెగ్యులేటింగ్ చట్టం -1773 కు సంబంధించి కిందివాటిలో సరైనది ఏది?
ఎ) భారతదేశానికి సంబంధించినతొలి లిఖిత చట్టం
బి) ఈ చట్టాన్ని 1773 మే 18న అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ వారెన్ హేస్టింగ్ బ్రిటిష్
పార్లమెంటులో ప్రవేశ పెట్టాడు
సి) బెంగాల్ గవర్నర్ హోదాను గవర్నర్
జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు.
డి) ఈ చట్టం ప్రకారం మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్
1) ఎ, బి 2) బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఏదీకాదు
3. ఏ ప్రణాళిక ఆధారంగా ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ 1947ను బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించింది?
1) ఇండియన్ కాంగ్రెస్ ప్రణాళిక
బి) సప్రూ ప్రణాళిక
3) వేవెల్ ప్రణాళిక
4) మౌంట్బాటన్ ప్రణాళిక
4. చార్టర్ చట్టం -1813కి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) భారతీయ విద్యాభివృద్ధికి లక్ష
రూపాయలతో నిధి ఏర్పాటు చేశారు.
2) సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు
3) ఈ చట్టం ద్వారా మత మార్పిడులకు అవకాశం ఏర్పడింది
4) మత నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు
5. కింది స్టేట్ మెంట్లను పరిశీలించండి.
ఎ) 1853 చార్టర్ చట్టం భారతీయ వర్తకంలో ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది.
బి) భారత ప్రభుత్వ చట్టం -1858 ప్రకారం బ్రిటిష్ పార్లమెంట్ ఈస్టిండియా కంపెనీని పూర్తిగా రద్దుచేసి భారతదేశాన్ని నేరుగా పాలించే బాధ్యతను చేపట్టింది.
పై స్టేట్మెంట్లలో సరైంది ఏది?
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) ఎ, బి రెండూ 4) ఏదీకాదు
6. కిందివాటిని సంవత్సరాల ఆధారంగా సరైన వరుస క్రమంలో అమర్చండి?
ఎ) సైమన్ కమిషన్
బి) రాష్ర్టాలకు స్వయం ప్రతిపత్తి
సి) ఫెడరల్ కోర్టు ఏర్పాటు
డి) మూడో రౌండ్ టేబుల్ సమావేశం
1) ఎ, బి, సి, డి 2) బి, ఎ, డి, సి
3) ఎ, సి, డి, బి 4) బి, ఎ, సి, డి
7. కిందివాటిలో భారత రాజ్యాంగంపై అత్యధిక ప్రభావాన్ని చూపింది ఏది?
1) 1935లో భారత ప్రభుత్వ చట్టం
2) యూఎస్ఏ రాజ్యాంగం
3) బ్రిటిష్ రాజ్యాంగం
4) ఐక్యరాజ్యసమితి చార్టర్
8. భారత కౌన్సిళ్ల చట్టం 1909కి సంబంధించి కిందివాటిలో సరైనది ఏది?
ఎ) ఈ చట్టాన్ని మింటో-మార్లే సంస్కరణలు అని పేర్కొంటారు.
బి) అప్పటి గవర్నర్ /వైస్రాయ్ లార్డ్ మింటో, భారత వ్యవహారాల కార్యదర్శి-మార్లే
సి) గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో తొలిసారి భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించారు.
డి) సభ్యత్వాన్ని పొందిన తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, బి, సి, డి
9. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ప్రాంతీయ కార్యనిర్వహణకు సంబంధించిన అంశాలు ఏవి?
ఎ) సంస్థానాల కార్యనిర్వహణ అధికారి
గవర్నర్కు ఇవ్వడం
బి) మంత్రి మండలి గవర్నర్కు సలహాలు ఇవ్వడం
సి) ప్రాంతీయ శాసన సభ్యుల ఓటింగ్ ద్వారా గవర్నర్ తొలగించబడతాడు
పైవాటిలో సరైనవి
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) బి
10. కిందివాటిని జరిగిన సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో ఉన్నవాటిలో సరైనది గుర్తించండి?
1) ఆగస్టు ప్రతిపాదనలు, సిమ్లా సమావేశం, సి.ఆర్.ఫార్ములా, క్యాబినెట్ మిషన్
2) క్రిప్స్ ప్రతిపాదనలు, ఆగస్టు ప్రతిపాదనలు, వేవెల్ ప్రణాళిక, క్యాబినెట్ మిషన్
3) ఆగస్టు ప్రతిపాదనలు, క్రిప్స్ ప్రతిపాదనలు, సి.ఆర్.
4) ఫార్ములా క్యాబినెట్ ప్రతిపాదనలు, వేవెల్ ప్రణాళిక, సి.ఆర్. ఫార్ములా, క్యాబినెట్ మిషన్
11. కిందివాటిలో 1919 భారతీయ చట్టంలోని ప్రధాన లక్షణాలు ఏవి?
ఎ) రాష్ర్టాల కార్యనిర్వహణ ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశ పెట్టడం.
బి) ముస్లింలకు విడిగా మతపరమైన
నియోజక గణాలను ప్రవేశ పెట్టడం
సి) కేంద్ర రాష్ర్టాలకు శాసనపరమైన
అధికారాన్ని దారాదత్తం చేయడం
డి) కేంద్ర రాష్ట్ర శాసన వ్యవస్థల విస్తరణ, పునర్ వ్యవస్థీకరణ సరైన సమాధానం ఎంపిక చేయండి.
1) ఎ, బి, సి 2) సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
12. ప్రస్తుత భారత రాజ్యాంగం కింద కేంద్రానికి రాష్ర్టాలకూ మధ్య శాసన నిర్మాణాధికారాల విభజన, కొన్ని విషయాల్లో 1935 భారత ప్రభుత్వ చట్టం కింద కేంద్రానికి రాష్ర్టాలకూ (ప్రావిన్స్) మధ్యగల అధికారాలను పోలి ఉన్నాయి. ఆ విషయాలేవి?
ఎ) మూడు జాబితాల విషయాల మధ్య ఏదైనా ఒక విషయం అతి వ్యాపనం చెందినట్లయితే, రెండింటిలోనూ కేంద్ర శాసన
వ్యవస్థకే ప్రాధాన్యం ఇవ్వడం.
బి) ఉమ్మడి జాబితా ప్రతికూలత ఉన్న
సందర్భంలో రెండింటిలోనూ రాష్ట్ర శాసనం మీద కేంద్ర శాసనానికే చెల్లుబాటు ఉంటుంది.
సి) రెండింటిలోనూ అవశిష్టాధికారాలను కేంద్ర శాసన వ్యవస్థకే అప్పగించడం జరిగింది
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) ఎ, సి 4) బి, సి
13. రెగ్యులేటింగ్ చట్టం -1773కి సంబంధించి కిందివాటిలో సరైనది ఏది?
1) ఈ చట్టం ఆధారంగా 1774లో
కలకత్తాలోని పోర్ట్ విలియంలో
సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు
2) ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులు ఉన్నారు
3) మొదటి ప్రధాన న్యాయమూర్తి
సర్ ఎలిజా ఇంపే
4) పైవన్నీ సరైనవే
14. మత ప్రాతిపదికన తొలిసారి నియోజకవర్గ గణాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం?
1) భారత కౌన్సిళ్ల చట్టం -1919
2) భారత ప్రభుత్వ చట్టం -1935
3) భారత కౌన్సిళ్ల చట్టం -1909
4) భారత స్వాతంత్య్ర చట్టం -1947
15. భారత ప్రభుత్వ చట్టం -1935లోని ముఖ్యాంశాలు ఏవి;?
ఎ) ప్రావిన్స్ల స్వతంత్రత
బి) కేంద్రంలో ద్విసభా విధానం
సి) రాష్ర్టాల్లో ద్వంద్వ సభ రద్దు
1) బి, సి 2) ఎ, బి
3) ఎ, సి 4) ఎ, బి, సి
16. ఇంగ్లండ్ ప్రదాని ఆట్లీ క్యాబినెట్ మిషన్ ప్రణాళికను ఎప్పుడు ప్రకటించాడు?
1) 1942 2) 1946
2) 1943 4) 1944
17. భారత రాజ్యాంగ చరిత్ర క్రమంలోని కింది వాటిని వరుస క్రమంలో అమర్చండి?
ఎ) క్యాబినెట్ మిషన్ ప్లాన్
బి) మింటోమార్లే నివేదిక
సి) మాంటేగ్ – చేమ్స్ఫర్డ్ నివేదిక
డి) సైమన్ కమిషన్ నివేదిక
1) బి, సి, డి, ఎ 2) సి, బి, ఎ, డి
3) ఎ, డి, బి, సి 4) సి, డి, ఎ, బి
18. భారత కౌన్సిళ్ల చట్టం -1909ని ఉద్దేశించి హిందువులకు ముస్లింలకు మధ్య వేర్పాటు బీజాలు వేసి, వారి మధ్య అడ్డుగోడలు సృష్టించిందని, భారత విభజనకు నాంది పలికిందని వ్యాఖ్యానించింది ఎవరు?
1) డాక్టర్ బీఆర్ అంబేద్కర్
2) గాంధీజీ
3) జవహర్లాల్ 4) పై ఎవరూకాదు
19. కింది స్టేట్ మెంట్లు పరిశీలించండి. భారత ప్రభుత్వ చట్టం 1935?
ఎ) రాష్ట్రీయ స్వయం ప్రతిపత్తిని సమకూర్చింది
బి) ఫెడరల్ కోర్టు ఏర్పాటుకు వీలు కల్పించింది
సి) కేంద్రంలో అఖిల భారత సమాఖ్యకు వీలు కల్పించింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
20. 1919 చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ) 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని మాంటేగ్ -ఛేమ్స్ఫర్డ్ సంస్కరణలు అని పేర్కొంటారు
బి) నాటి భారత కార్యదర్శి మాంటేగ్
సి) నాటి భారత వైస్రాయ్ ఛేమ్స్ఫర్డ్
డి) ఈ చట్టాన్ని 1919లో రూపొందించి
నప్పటికీ 1921 నుంచి అమల్లోకి వచ్చింది
1) ఎ, బి, సి, డి 2) ఎ, డి
3) ఎ, బి, సి 4) పైవేవీకాదు
21. 16 మే 1946లో వచ్చిన క్యాబినెట్ మిషన్ ప్రణాళికకు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?
1. బ్రిటిష్ ఇండియా చేత రాష్ర్టాలకు కార్య
నిర్వహణ శాసనపర అధికారాలను కేంద్రం నుంచి బదిలీ అయ్యాయి.
2. సంస్థానాలు కార్యనిర్వహణ, శాసనపర అధికారాల నుంచి విముక్తి పొందాయి.
పైవాటిలో సరైనవి ఏది?
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
22. మాంటెంగ్-చేమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919 కి సంబంధించి కిందివాటిలో సరైనది?
1) రాష్ట్రస్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశ పెట్టారు
2) దేశంలో మొదటిసారిగా ద్విసభా పద్ధతిని ప్రవేశ పెట్టారు
3) భారత హై కమిషనర్ అనే పదవిని
సృష్టించారు
4) పైవన్నీ సరైనవే
23. ఏ కమిటీ సూచన మేరకు భారత్కు విడిగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు?
1) లీ కమిషన్ 2) సైమన్ కమిషన్
3) క్రిప్స్ కమిషన్ 4) ఏదీకాదు
24. 1947 ఆగస్టు 15 తర్వాత క్యాబినెట్ వ్యక్తులు, వారు నిర్వహించిన శాఖలను జతపరచండి.
పేరు శాఖ
ఎ. జాన్ మత్తాయ్ 1) విదేశీ వ్యవహారాలు
బి) సి.హెచ్. బాబా 2) వ్యవసాయం
సి) జవహర్లాల్ నెహ్రూ 3) రైల్వేలు
డి) బాబు రాజేంద్ర ప్రసాద్ 4) వాణిజ్యం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-2, డి-1
25. మత ప్రాతినిధ్యం ప్రకారం సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు, ఐరోపా వారికి ప్రత్యేక నియోజక వర్గాలను ఏ చట్టం ప్రకారం ప్రకటించారు?
1) భారత కౌన్సిళ్ల చట్టం -1909
2) భారత కౌన్సిళ్ల చట్టం -1919
3) భారత ప్రభుత్వ చట్టం -1935
4) భారత స్వాతంత్య్ర చట్టం -1947
26. కిందివాటిలో ఆలిండియా స్టేట్ పీపుల్స్కాన్ఫరెన్స్ లక్ష్యం ఏది?
1) సంస్థానాల్లో బాధ్యతాయుత
ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం
2) సంస్థానాల్లో కాంగ్రెస్ పలుకుబడిని వ్యతిరేకించడం
3) సంస్థానాల్లో ప్రజామండళ్లను అణచివేయడం
4) సంస్థానాల సమావేశం ఏర్పాటు చేయడం
27. భారత రాజ్యాంగానికి ప్రధాన ఆధారం?
1) అమెరికన్ రాజ్యాంగం
2) ఫ్రెంచి రాజ్యాంగం
3) బ్రిటిష్ రాజ్యాంగం
4) భారత ప్రభుత్వ చట్టం 1935
28. 1919 సంస్కరణలు అసంతృప్తి నిరాశ తోపాటు, సూర్యుడులేని ఉదయంగా ఉందని అభిప్రాయపడింది ఎవరు?
1) బాలగంగాధర్ తిలక్
2) బిపిన్ చంద్రపాల్
3) లాలా లజపతిరాయ్
4) అరవింద ఘోష్
29. 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని దేనికి ప్రథమ చర్యగా పేర్కొంటారు?
1) భారతదేశం కోసం శాసనం చేసే బ్రిటిష్ పార్లమెంటు హక్కును నొక్కి చెప్పడం
2) కార్యనిర్వాహక వర్గం నుంచి శాసన
వ్యవస్థను వేరు చేయడం
3) కార్యనిర్వాహక వర్గం నుంచి న్యాయ
వ్యవస్థను వేరు చేయడం
4) శాసన నిర్మాణాన్ని కేంద్రీకరించడం
30. ఏ సంస్కరణలను బ్రిటిషర్లు ప్రకటించి ఉండాల్సింది కాదని, ఏ చట్టాన్ని భారతీయులు స్వీకరించడం తగదని శ్రీమతి అనిబీసెంట్ ఏ చట్టాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు?
1) భారత కౌన్సిళ్ల చట్టం -1919
2) భారత కౌన్సిళ్ల చట్టం -1909
3) భారత ప్రభుత్వ చట్టం -1935
4) భారత స్వాతంత్య్ర చట్టం -1947
31. సైమన్ కమిషన్ను బ్రిటిష్ ప్రధాని బాల్డిన్ ఎప్పుడు ప్రకటించాడు?
1) 1927 జనవరి 2) 1927 ఆగస్టు
3) 1927 నవంబర్ 4) 1927 డిసెంబర్
32. “మానవులను సమానంగా సృష్టించడమైనది” అని కిందివాటిలో మొదట ప్రకటించిన పత్రం ఏది?
1) మాగ్నా కార్టా
2) మానవ హక్కుల ప్రకటన 1789
3) స్వాతంత్య్ర ప్రకటన 1776
4) భారత రాజ్యాంగం 1950
33. భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పౌర, రెవెన్యూ వ్యవహారాలను బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా నియంత్రించడానికి వీలుగా బ్రిటన్లో నియంత్రణ బోర్డు (బోర్డ్ ఆఫ్ కంట్రోల్) ఏర్పాటుకు మూలమైన చట్టం ఏది?
1) 1773 రెగ్యులేటింగ్ చట్టం
2) 1784 పిట్స్ ఇండియా చట్టం
3) 1833 చార్టర్ చట్టం
4) 1858 భారత ప్రభుత్వ చట్టం

Answers
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






