పాత కోటాలోనే పీజీ కౌన్సెలింగ్

వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మొదలుకానున్న పీజీ వైద్య విద్య 2022 కౌన్సెలింగ్లో పాత కోటానే అమలవుతుందని నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్పష్టంచేసింది. ఆలిండియా కోటా కింద సెంట్రల్, డీమ్డ్ వర్సిటీల్లో 100 శాతం, ఇతర వర్సిటీల పరిధిలో 50 శాతం అమలు చేయనున్నట్టు వెల్లడించింది. కొవిడ్ సందర్భంగా కాలేజీల గుర్తింపు, కోర్సుల రెన్యూవల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఆయా కాలేజీలకు 2022 అడ్మిషన్ల వరకు గుర్తింపును పొడిగించినట్టు గుర్తుచేసింది. ప్రత్యేక సందర్భాల్లో కాలేజీ గుర్తింపు లేదా కోర్సులను రద్దు చేసినవాటికి మాత్రం ఇది వర్తించదని తెలిపింది. నూతన కాలేజీలు, కోర్సుల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నది.
Previous article
బోధ్ గయాలోని ఐఐఎంలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
Next article
ఆర్మీ ర్యాలీ నమోదుకు తుది గడువు సెప్టెంబర్ 3
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు