కరెంట్ అఫైర్స్

అంతర్జాతీయం
హైయాంగ్ 2డీచైనాకు చెందిన జియుక్వాన్ శాటిలైట్ సెంటర్ నుంచి మే 19న లాంగ్మార్చ్-4బి రాకెట్ ద్వారా హైయాంగ్-2డి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది సముద్రాల విపత్తు సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
అణువిద్యుత్ ప్రాజెక్ట్చైనా-రష్యా అతిపెద్ద అణువిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి మే 19న ఆమోదించాయి. ఉమ్మడిగా ఈ ఒప్పందం ప్రకారం జుడాపు అణువిద్యుత్ ప్లాంట్ 3, 4 యూనిట్లు, తియాన్వన్ అణువిద్యుత్ ప్లాంట్ 7, 8 యూనిట్ల నిర్మాణానికి ఆమోదం తెలిపాయి.
భారత్కు అమెరికా సాయంకరోనా సెకండ్ వేవ్తో అల్లాడుతున్న భారత్కు అమెరికా 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్ను భారత్కు పంపించడం కోసం అమెరికా కేబినెట్ మే 20న ఆమోదించింది.
ఇన్ఫెక్షన్స్-2021ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆన్ హెచ్ఐవీ, వైరల్ హెపటైటిస్ అండ్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్-2021 పేరుతో రూపొందించిన ఒక నివేదికను మే 20న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీ, వైరల్ హెపటైటిస్ అండ్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏటా 23 లక్షల మంది చనిపోతున్నారు.
జాతీయం
కొత్త జిల్లాపంజాబ్ రాష్ట్రంలో నూతన 23వ జిల్లాగా మలేర్కోట్లను మే 14న ప్రకటించారు. మలేర్కోట్ల ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. అసెంబ్లీ స్థానాలు 117.
గుజరాత్కు వెయ్యి కోట్లుఅరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను కారణంగా దెబ్బతిన్న గుజరాత్ను ఆదుకునేందుకు ప్రధాని మోదీ తక్షణ సాయంగా రూ.1000 కోట్లు మే 19న ప్రకటించారు. తుఫాను వల్ల వేర్వేరు రాష్ర్టాల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల వంతున, గాయపడినవారికి రూ.50,000 చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని చెప్పారు.
ఆక్సిజన్ ఎక్స్ప్రెస్కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ను అందించడం కోసం ఏప్రిల్ 19న ప్రారంభించిన ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’ 10 వేల టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను సరఫరా చేసి రికార్డు సృష్టించినట్లు రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ మే 17న వెల్లడించారు. ప్రతిరోజు 600కు పైగా ట్యాంకర్లతో మొత్తం 13 రాష్ర్టాలకు 800 టన్నుల ఆక్సిజన్ను రైల్వే సరఫరా చేస్తుంది.
పశ్చిమబెంగాల్లో శాసనమండలిశాసన మండలి ఏర్పాటుకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మే 19న ఆమోదించింది. 1969లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం శాసన మండలి వ్యవస్థను రద్దుచేసింది. దేశంలో ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో శాసనమండలి వ్యవస్థ ఉంది.
కేరళ సీఎంగా పినరయికేరళ సీఎంగా సీపీఎం సీనియర్ నాయకుడు పినరయి విజయన్ రెండోసారి మే 20న ప్రమాణం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ విజయన్తో ప్రమాణం చేయించారు. వామపక్ష కూటమి ఎల్డీఎఫ్కు సీపీఎం తరఫున పినరయి నాయకత్వం వహించారు.
బ్లాక్ ఫంగస్బ్లాక్ ఫంగస్ను ‘అంటువ్యాధుల చట్టం-1897’ కింద గుర్తించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మే 20న ఆదేశాలు జారీచేసింది. వ్యాధి గుర్తింపు, చికిత్స, నివారణపై ఐసీఎంఆర్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.
తేనెటీగల దినోత్సవంమే 20న అంతర్జాతీయ తేనెటీగల పెంపకం దినోత్సవాన్ని నిర్వహించారు. తేనెటీగల కాలనీల ఏర్పాటుకు కేంద్రం రుణంతోపాటు మొత్తం వ్యయంలో 40 శాతం రాయితీ ఇస్తుంది. ఇందుకు ‘జాతీయ తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి మిషన్’ను కేంద్రం ఏర్పాటు చేసింది. దీని అమలుకు ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకంలో మూడేండ్ల (2020-23)లో రూ.500 కోట్లు ఖర్చు చేస్తుంది.
వార్తల్లో వ్యక్తులు
నీరా టాండన్వైట్హౌస్ సలహాదారుగా భారత అమెరికన్ నీరా టాండన్ మే 15న నియమితులయ్యారు. డిజిటల్ సేవలు, అందుబాటులోని వైద్య సేవల చట్టంపై అధ్యక్షుడు బైడెన్కు ఆమె సలహాలు ఇస్తారు. ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ అనే సంస్థకు ఆమె అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.
తషి యాంగ్జోమ్
అరుణాచల్ప్రదేశ్కు చెందిన తషి యాంగ్జోమ్ మే 15న ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. 2021లో ఈ పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా ఘనత సాధించారు.
సందేశ్ గుల్హానే
స్కాట్లాండ్లో ఎంపీగా మహారాష్ట్రలోని అమరావతికి చెందిన డాక్టర్ సందేశ్ గుల్హానే మే 16న ఎన్నికయ్యారు. స్కాటిష్ పార్లమెంటుకు భారత మూలాలున్న వ్యక్తి ఎన్నిక కావడం ఇదే తొలిసారి.
జస్టిస్ లలిత్
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ మే 17న నియమితులయ్యారు. ఈ స్థానంలో ఇదివరకు జస్టిస్ ఎన్వీ రమణ ఉన్నారు. ఆయన సుప్రీంకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టడంతో లలిత్ను ఎంపిక చేశారు.
ఆండ్రియా మెజా
మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నారు. అమెరికాలోని మియామిలో మే 17న నిర్వహించిన 69వ మిస్ యూనివర్స్ పోటీల్లో 73 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో భారత్కు చెందిన మిస్ ఇండియా ఎడలిన్ కాస్టిలినో నాలుగో స్థానంలో నిలిచింది.
బాలసుబ్రమణ్యన్
సూపర్ఫాస్ట్ డీఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నిక్ను అభివృద్ధి చేసిన బ్రిటన్ రసాయన శాస్త్రవేత్తలు శంకర్ బాలసుబ్రమణ్యం, డేవిడ్ క్లెనెర్మన్లకు ఫిన్లాండ్ నోబెల్ సైన్స్ బహుమతి (మిలీనియన్ టెక్నాలజీ అవార్డు-2020) మే 19న లభించింది. ఈ బహుమతి కింద ఒక మిలియన్ యూరోలు అందిస్తారు.
జస్టిస్ సంయజ్ యాదవ్
అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ (సీజే)గా జస్టిస్ సంజయ్ యాదవ్ను సుప్రీంకోర్టు కొలీజియం మే 20న సిఫారసు చేసింది. ఆయన ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు తాత్కాలిక సీజేగా వ్యవహరిస్తున్నారు.
అద్వైత్ కుమార్
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖలో అండర్ సెక్రటరీగా అద్వైత్ కుమార్ సింగ్ మే 20న నియమితులయ్యారు. ఆయన 2013 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి. డిప్యూటీ సెక్రటరీ స్థాయి పోస్టును తాత్కాలికంగా డౌన్గ్రేడ్ చేసి ఆ స్థానంలో ఆయనను కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ నియమించింది.
అన్వీ భూటాని
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఉప ఎన్నికల్లో భారత సంతతి విద్యార్థిని అన్వీ భూటాని మే 21న విజయం సాధించారు. 2021-22 సంవత్సరానికి ఆక్స్ఫర్డ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన రెండో భారతీయురాలు.
సురేష్ ముకుంద్
10వ వరల్డ్ కొరియోగ్రఫీ అవార్డు-2020 సురేష్ ముకుంద్కు మే 21న లభించింది. వరల్డ్ ఆఫ్ డాన్స్లో భాగంగా టీవీ రియాలిటీ షో కాంపిటీషన్ విభాగంలో వరల్డ్ ఆఫ్ సీజన్లో ఈ అవార్డు దక్కింది.
క్రీడలు
రఫెల్ నాదల్
10వ ఇటాలియన్ ఓపెన్ టోర్నీని స్పెయిన్ టెన్సిస్ స్టార్ రఫెల్ నాదల్ సాధించాడు. మే 16న నిర్వహించిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాదల్ నొవాక్ జకోవిచ్పై గెలిచాడు. ఈ విజయంతో అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్గా జకోవిచ్ (36 టైటిల్స్) పేరుతో ఉన్న రికార్డును నాదల్ సమం చేశాడు. నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ను 13 సార్లు, బార్సిలోనా ఓపెన్ను 12 సార్లు, మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ను 11 సార్లు గెలిచాడు.
స్వైటెక్
ఈ టోర్నీ మహిళల సింగిల్స్లో పోలెండ్కు చెందిన ఇగా స్వైటెక్ విజయం సాధించింది. కెరీర్లో ఆమెకు ఇది మూడో టైటిల్.
శంకర్కు స్వర్ణం
అమెరికాలోని మాన్హట్టన్లో మే 16న జరిగిన బిగ్12 అవుట్డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్షిప్లో భారత యువ హైజంపర్ తేజస్విన్ శంకర్ స్వర్ణ పతకం సాధించాడు. వెర్నాన్ టర్నర్, జాక్వెన్ హోగన్ రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. తమిళనాడుకు చెందిన తేజస్విన్ 2017లో అమెరికాకు వెళ్లి కన్సాస్ స్టేట్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చదువుతూ అథ్లెటిక్స్ కెరీర్ను కొనసాగిస్తున్నాడు.
బ్యాటింగ్ కోచ్గా శివ్ సుందర్
క్రికెట్ మహిళల జట్టు బ్యాటింగ్ కోచ్గా టీమిండియా మాజీ ఓపెనర్ శివ్ సుందర్ దాస్ మే 17న నియమితులయ్యాడు. పవార్ నేతృత్వంలో అతడు బాధ్యతలు చేపడతాడు. భారత్ తరఫున అతడు 23 టెస్టుల్లో 1326 పరుగులు చేశాడు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
- Education News
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






