మార్చి 25 వరకు నీట్ పీజీ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: నీట్ పీజీ (NEET PG) ప్రవేశ పరీక్షను కేంద్ర ఆరోగ్య శాఖ వాయిదావేసింది. దీంతో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. అభ్యర్థులు మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షకు సంబంధించిన వివరాలు nbe.edu.in, natboard.edu.in వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. నీట్ పీజీ పరీక్ష మే 21న జరగనున్నది.
నీట్ పీజీ కౌన్సెలింగ్, ప్రవేశ పరీక్ష తేదీలు క్లాష్ అవుతుండటంతో పలువురు అభ్యర్థులు నీట్ పీజీ 2022ని వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మే 21న పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ పరీక్షను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
నీట్ పీజీ-2022 సవరించిన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ల దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 25
అడ్మిట్ కార్డుల విడుదల: మే 16
నీట్ పీజీ పరీక్ష తేదీ: మే 21
ఫలితాల విడుదల: జూన్ 20
వెబ్సైట్: natboard.edu.in
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






