జేఎన్టీయూలో మల్టిపుల్ ఎంట్రీ.. ఎగ్జిట్

అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశాల మేరకు ఈ విద్యాసంవత్సరం నుంచి మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ను అమలుచేయాలని జేఎన్టీయూ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో విద్యార్థి బీఈ/ బీటెక్ కోర్సులో రెండేండ్లు పూర్తిచేసి మధ్యలో నిష్క్రమించవచ్చు. వీరు నిర్దేశిత క్రెడిట్లు పొందితే గ్రాడ్యుయేషన్ డిప్లొమాను జారీచేస్తారు. విద్యార్థులు ఇతర కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. లేదంటే ఇంటర్న్షిప్, ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఏడాది విరామం తర్వాత ఇదే డిప్లొమా ఆధారంగా బీఈ/బీటెక్ మూడో సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులను పాస్ అయ్యి.. క్రెడిట్స్ పొందితేనే సర్టిఫికెట్ను జారీచేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
- Tags
- AICTE
- JNTU
- Multiple Entry Exit
Previous article
దోస్త్ కు 1.10లక్షల రిజిస్ట్రేషన్లు
Next article
నవంబర్ 27న కామన్ అడ్మిషన్ టెస్ట్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు