ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ప్రారంభం
– తొలిసారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు
ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాల షెడ్యూల్ విడుదలయ్యింది. 2022 -23 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల షెడ్యూల్ను బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ గురువారం విడుదల చేశారు. మొదటి విడత అడ్మిషన్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయని, ఆగస్టు 17లోగా మొదటి విడుత అడ్మిషన్లు పూర్తిచేస్తామని తెలిపారు. మార్కుల మెమోల ఆధారంగా తాత్కాలిక అడ్మిషన్లు పూర్తిచేయాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఈ విద్యాసంవత్సరానికి గాను బోర్డు మంజూరుచేసిన సెక్షన్లు, ప్రతి విభాగంలోని సీట్ల సంఖ్యను ప్రతిరోజూ కాలేజీలో ప్రదర్శించాలని జలీల్ ఆదేశించారు. ఇంటర్బోర్డు అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రమే విద్యార్థులు ప్రవేశాలు పొందాలని సూచించారు. అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను https://acadtsbie.cgg.gov.in, https://tsbie.cgg. gov.in వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. ఫస్టియర్లో చేరినవారికి జూలై 11 నుంచి తరగతులు నిర్వహిస్తారు. ప్రవేశాల్లో తొలిసారిగా ఈడబ్ల్యూఎస్ కోటాకు 10 శాతం సీట్లు కేటాయించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీలకు 29, పీహెచ్ 3, ఎన్సీసీ, స్టోర్ట్ కోటాలో 5, ఎక్స్సర్వీస్మెన్ 3 చొప్పున రిజర్వేషన్లు ప్రకారం సీట్లను భర్తీచేయాలని కోరారు. 33 శాతం సీట్లను బాలికల కోసం కేటాయించాలని పేర్కొన్నారు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?