వైద్య విద్యార్థుల పరీక్షలు వాయిదా
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలో శుక్రవారం వైద్య విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా వేసినట్టు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు పేర్కొన్నారు. శుక్రవారం జరగాల్సిన ఎంబీబీఎస్ మైక్రో బయాలజీ పరీక్షను ఈ నెల 19న, బీడీఎస్ పెడిమోడొంటాలజీ పరీక్షను 21న, పోస్ట్ బేసిక్ నర్సింగ్ పరీక్షను 30న నిర్వహించనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 12 నుంచి జరిగే పరీక్షల్లో ఎటువంటి మార్పులు ఉండవని వారు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ను పరిశీలించవచ్చని సూచించారు.
Previous article
నాబార్డ్ లో డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు
Next article
జూనియర్ కాలేజీ గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






