వినియోగదారుల హక్కుల చట్టం-2019
# వినియోగదారుల హక్కులపై భారత ప్రభుత్వం 2019లో నూతన చట్టాన్ని రూపొందించింది. దీన్ని ‘వినియోగ దారుల హక్కుల చట్టం-2019’ పేరుతో పిలుస్తున్నారు. ఈ చట్టం 2020 జూలై 20 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం వల్ల వినియోగదారుడు మరింత బలవంతుడు అవుతాడు. వినియోగదారుల రక్షణ మండలాలు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు, మధ్యవర్తిత్వం, ఉత్పత్తి బాధ్యత, తయారీ దారులకు శిక్షణ, కల్తీ వస్తువుల అమ్మకం లాంటి విషయాల్లో అనేక నిబంధనలు ఈ చట్టంలో పొందుపరిచారు.
# ఈ చట్టం కింద కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ ఏర్పాటవుతుంది. ఇది వినియోగదారుల హక్కులను కాపాడటానికి, అమలు చేయడానికి పనిచేస్తుంది. హక్కుల ఉల్లంఘన జరిగినా, అనుచిత వ్యాపార విధానాలు అవలంబించినట్లు తెలిసినా, తప్పుదారి పట్టించే ప్రకటనలు వెలువరించినా దర్యాప్తు జరిపి ఆ తయారీదారులు లేదా అమ్మకందారులు లేదా ప్రకటనల ప్రచురణ, ప్రసారకర్తల మీద జరిమానాలు విధిస్తుంది.
# ఈ కామర్స్ వేదికలు అనుచిత వ్యాపార విధానాలు అవలంబించకుండా అడ్డుకోవడానికి కూడా చట్టంలో నిబంధనలు ఉన్నాయి.
#ఈ చట్టం ప్రకారం కేసు పరిశీలనా పరిధి జిల్లా స్థాయిలో రూ. కోటి, రాష్ట్రస్థాయిలో రూ. కోటి నుంచి రూ. 10 కోట్ల వరకు, జాతీయ స్థాయిలో రూ. 10 కోట్ల కంటే ఎక్కువ జరిమానా విధిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?