సిరిసిల్లలో బీఎస్సీ హానర్స్ డిజైన్ టెక్నాలజీ కోర్సు
-దరఖాస్తులకు తుది గడువు 24
-ఇంటర్ ఉత్తీర్ణులైన అమ్మాయిలకే అవకాశం
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీలో బీఎస్సీ (హానర్స్)లో డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెడుతున్నట్టు సొసైటీ కార్యదర్శి రొనాల్డ్రోస్ తెలిపారు. 40 సీట్లు ఉండే ఈ కోర్సులో అమ్మాయిలకు మాత్రమే అడ్మిషన్లు ఇస్తామని చెప్పారు. టీఎస్డబ్ల్యూడీటాట్-2022 ప్రవేశపరీక్ష ద్వారా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. జనరల్ ఎబిలిటీ నుంచి 30 మార్కులు, డిజైన్ ఎబిలిటీ నుంచి 70 మార్కులకు ప్రశ్నలు ఉంటాయని వివరించారు. ఇంటర్మీడియట్ లేదా కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసినవారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు www.tswreis.ac.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?