29లోపు హాజరు మినహాయింపునకు దరఖాస్తులు
ఇంటర్ చదవాలన్నా.. పరీక్షలు రాయాలన్నా.. కాలేజీల్లో అడ్మిషన్ పొందాలి. క్లాసులకు హాజరుకావాలి. కానీ, ఆర్ట్ లేదా హ్యూమానిటీస్ కోర్సుల్లో అడ్మిషన్ పొందకుండానే.. కాలేజీకెళ్లకుండానే ఇంటర్ పరీక్షలకు హాజరుకానొచ్చు. ఎంచక్కా ఎగ్జామ్స్ రాసి పాస్కానొచ్చు. ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నదే హాజరు మినహాయింపు పథకం. ఇంటర్బోర్డులో గతకొంత కాలంగా అమలుచేస్తున్న ఈ స్కీమ్లో భాగంగా ఆసక్తి గలవారు ప్రైవేట్ విద్యార్థులుగా ఇంటర్ పూర్తిచేస్తున్నారు. త్వరలోనే నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కు హాజరయ్యేందుకు ఇంటర్బోర్డు అవకాశం ఇచ్చింది. ఇలాంటి వారు రూ. 500 ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది. రూ. 200 ఆలస్య రుసుముతో మొత్తం ఫీజును ఈ నెల 29 వరకు చెల్లించి హాజరు మినహాయింపు పొందవచ్చని ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు.
Previous article
‘బీసీ ఓవర్సీస్’కు కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
Next article
భారత ఆర్థిక వ్యవస్థ- నిరుద్యోగం రకాలు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






