8 రాష్ట్రాలపై వాతావరణ ప్రతికూల ప్రభావం
మీకు తెలుసా?
# భారత శాస్త్ర సాంకేతిక విభాగం ‘వాతావరణ మార్పుల సర్దుబాట్లకు ఉమ్మడి ఫ్రేమ్ వర్క్ ఉపయోగించడం’ అనే నివేదికను 2021 ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలోని వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, జిల్లాలను గుర్తించారు. నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు జార్ఖండ్ , మిజోరాం, ఒడిశా, ఛత్తీస్ గఢ్ , అసోం, బీహార్ , అరుణాచల్ ప్రదేశ్ , పశ్చిమబెంగాల్ పై వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం ఉంటుందని తేలింది. ఈ రాష్ట్రాలు వాతావరణ మార్పులకు అనుగుణంగా తక్షణం సర్దుబాటు చేసుకోవాలని నివేదిక సూచించింది. అసోం, బీహార్ , జార్ఖండ్ రాష్ట్రాల్లో 60 శాతానికిపైగా జిల్లాలు ఈ అంశంలో బలహీనంగా ఉన్నాయి.
# అసోంలో అడవుల నరికివేత పెరిగిపోవడం వల్ల ఇలా జరుగుతోందని నివేదిక పేర్కొంది. అసోంలో ఇప్పటికే 42 శాతం అడవులు ఉన్నా గతం కంటే వీటి విస్తరణ బాగా తగ్గింది. బీహార్లో 36 జిల్లాల్లో ఆరోగ్య మౌలిక వసతులు దారుణంగా ఉండటం వల్ల ఆ రాష్ట్రం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటుంది.
# జార్ఖండ్లో పంట బీమా పథకం లేకపోవడం, వర్షాధారంగా ఉన్న వ్యవసాయ రంగం వల్ల ప్రతికూల ప్రభావం ఉంది. హిమాచల్ ప్రదేశ్ , తెలంగాణ, సిక్కిం, పంజాబ్ లను మధ్యస్థాయి బలహీన రాష్టాలుగా నివేదిక వెల్లడించింది.
# ఉత్తరాఖండ్ , హర్యానా, తమిళనాడు, కేరళ, నాగాలాండ్ , గోవా, మహారాష్ట్ర తక్కువ బలహీనతలు గల లేదా తక్కువ ప్రతికూల ప్రభావం గల రాష్ట్రాలుగా నివేదిక గుర్తించింది.
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






