ఎన్డీఏలో మెరిసిన స్వరూప్రావు
# డిఫెన్స్ అకాడమీ పరీక్షలో 213వ ర్యాంకు
# జాతీయ స్థాయిలో సత్తా చాటిన జగిత్యాలవాసి
యూపీఎస్సీ ద్వారా నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పరీక్షలో జగిత్యాల జిల్లావాసి మెరిశాడు. జగిత్యాలలోని హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన బోయినపల్లి ప్రసాద్రావు – మనోజ దంపతుల కుమారుడు స్వరూప్రావు ఎన్డీఏ-2021 పోటీ పరీక్షకు హాజరయ్యాడు. ఐదులక్షల మందికిపైగా హాజరైన పరీక్షలో ఎనిమిది వేల మంది మౌఖిక పరీక్షకు అర్హత సాధించగా అందులో ఇతడు ఉన్నాడు. వీరికి 12 బోర్డుల ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి 466 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి పది రోజులపాటు మెడికల్ టెస్ట్ నిర్వహించి బుధవారం మెరిట్ జాబితా విడుదల చేశారు. ఇందులో స్వరూప్రావు 213వ ర్యాంకు సాధించాడు. శిక్షణ అనంతరం అధికారులు ఇతడిని నేవీ అధికారిగా నియమించనున్నారు. స్వరూప్రావు ఎంపికపై తల్లిదండ్రులు, కాలనీవాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Previous article
ఎడ్సెట్ దరఖాస్తు గడువు పెంపు
Next article
పీజీ చదవకుండానే పీహెచ్డీ
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?