26 నుంచి ప్రైమరీ టీచర్లకు శిక్షణ
-ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి
రాష్ట్రంలోని ప్రైమరీ టీచర్లకు ఈ నెల 26 నుంచి 28 వరకు రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) డైరెక్టర్ ఎం రాధారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) ఆధ్వర్యంలో హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీఎస్ఐఆర్డీలో ఈ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంచడం, సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం, సులభ పద్ధతిలో గణితం అర్థమయ్యేలా బోధించడం తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఈ తరగతులకు ప్రతిజిల్లా నుంచి తెలుగు, ఇంగ్లిష్ మీడియం టీచర్లు నలుగురు, ఉర్దూలో నలుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేయాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఈ నెల 21లోపు పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. వివరాలకు tgscertct@gmail.comలో సంప్రదించాలని సూచించారు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?