Sagar mala project | సాగరమాల ప్రాజెక్టు
సువిశాల తీరప్రాంతం భారతదేశం సొంతం
-దేశాభివృద్ధిలో ఈ తీరప్రాంత ప్రాధాన్యాన్ని పెంచేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పథకమే సాగరమాల
-ఈ ప్రాజెక్టు ద్వారా దేశ తూర్పు, పశ్చిమ తీరంలోని నౌకాశ్రయాలను అభివృద్ధిచేసి రోడ్డు, రైలు, వాయు మార్గాలతో అనుసంధానిస్తారు. తద్వారా తీరప్రాంతాల అభివృద్ధితోపాటు దేశాభివృద్ధికి జల రవాణాను చోదకశక్తిగా మార్చటం ఈ పథకం ఉద్దేశం.
-దేశంలో 12 నౌకాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి కేంద్ర క్యాబినెట్ 2015 మార్చి 25న ఆమోదం తెలిపింది.
-ఈ ప్రాజెక్టును బెంగళూరులో 2015 జూలై 31న ప్రారంభించారు.
-ఈ పథకం అమలుకోసం కేంద్ర షిప్పింగ్శాఖ మంత్రి నేతృత్వంలో సంబంధిత కేంద్ర క్యాబినెట్ మంత్రులు, రాష్ర్టాల ముఖ్యమంత్రులతో నేషనల్ సాగరమాల అపెక్స్ కమిటీని ఏర్పాటుచేశారు.
-ఈ ప్రాజెక్టు ద్వారా సమగ్రమైన తీరప్రాంత ఆర్థిక మండలి (సీఈఆర్)ని ఏర్పాటుచేస్తారు.
-నౌకాశ్రయాల ఆధునీకరణ, నౌకాశ్రయాల కార్యకలాపాలను వ్యవస్థీకృతంచేయటం, సుస్థిర, సమర్థవంతమైన రవాణా మౌలికవసతులను అభివృద్ధి చేయటం ద్వారా జాతీయాదాయానికి 2 శాతం సంపదను అందించటం ఈ పథకం లక్ష్యాల్లో ఒకటి.
-ఇందులో భాగంగా 1200కు పైగా చిన్న, పెద్ద దీవులను అనుసంధానిస్తూ 189 లైట్హౌస్లను నెలకొల్పాలని నిర్ణయించారు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు