Sagar mala project | సాగరమాల ప్రాజెక్టు

సువిశాల తీరప్రాంతం భారతదేశం సొంతం
-దేశాభివృద్ధిలో ఈ తీరప్రాంత ప్రాధాన్యాన్ని పెంచేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పథకమే సాగరమాల
-ఈ ప్రాజెక్టు ద్వారా దేశ తూర్పు, పశ్చిమ తీరంలోని నౌకాశ్రయాలను అభివృద్ధిచేసి రోడ్డు, రైలు, వాయు మార్గాలతో అనుసంధానిస్తారు. తద్వారా తీరప్రాంతాల అభివృద్ధితోపాటు దేశాభివృద్ధికి జల రవాణాను చోదకశక్తిగా మార్చటం ఈ పథకం ఉద్దేశం.
-దేశంలో 12 నౌకాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి కేంద్ర క్యాబినెట్ 2015 మార్చి 25న ఆమోదం తెలిపింది.
-ఈ ప్రాజెక్టును బెంగళూరులో 2015 జూలై 31న ప్రారంభించారు.
-ఈ పథకం అమలుకోసం కేంద్ర షిప్పింగ్శాఖ మంత్రి నేతృత్వంలో సంబంధిత కేంద్ర క్యాబినెట్ మంత్రులు, రాష్ర్టాల ముఖ్యమంత్రులతో నేషనల్ సాగరమాల అపెక్స్ కమిటీని ఏర్పాటుచేశారు.
-ఈ ప్రాజెక్టు ద్వారా సమగ్రమైన తీరప్రాంత ఆర్థిక మండలి (సీఈఆర్)ని ఏర్పాటుచేస్తారు.
-నౌకాశ్రయాల ఆధునీకరణ, నౌకాశ్రయాల కార్యకలాపాలను వ్యవస్థీకృతంచేయటం, సుస్థిర, సమర్థవంతమైన రవాణా మౌలికవసతులను అభివృద్ధి చేయటం ద్వారా జాతీయాదాయానికి 2 శాతం సంపదను అందించటం ఈ పథకం లక్ష్యాల్లో ఒకటి.
-ఇందులో భాగంగా 1200కు పైగా చిన్న, పెద్ద దీవులను అనుసంధానిస్తూ 189 లైట్హౌస్లను నెలకొల్పాలని నిర్ణయించారు.
RELATED ARTICLES
-
What to do if you’re feeling sleepy while studying
-
Public life chariots are minerals | జనజీవన రథచక్రాలు ఖనిజాలు (గ్రూప్-1 ప్రత్యేకం)
-
The first stage of Telangana development | తెలంగాణ తొలి వికాస దశ ( గ్రూప్-1 మెయిన్స్)
-
An inscription describing the genealogy of Kakatiya | కాకతీయుల వంశవృక్షాన్ని వివరించిన శాసనం? ( పోటీపరీక్షల ప్రత్యేకం )
-
What title did Tanisha give to Madanna | మాదన్నకు తానీషా ఇచ్చిన బిరుదు? హిస్టరీ
-
An inscription by Annaladevi, the wife of Rudradeva | రుద్రదేవుని భార్య అన్నాలదేవి వేసిన శాసనం?
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యుజీ, పీజీ ప్రవేశాలు
మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్లో450 పోస్టుల భర్తీ