Did you know | ఇది తెలుసా..!
-ప్రధానమంత్రి అంత్యోదయ అన్న యోజన
-ఈ పథకాన్ని 2000, డిసెంబర్ 25న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
-దేశంలోని కోటి పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం దీని లక్ష్యం.
-ముఖ్యంగా దారిద్య్రరేఖకు (బీపీఎల్) దిగువన నివసిస్తున్న నిరుపేద కుటుంబాలను గుర్తించడం.
-వీరికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రూ. 2లకు గోధుమలు, రూ. 3లకు బియ్యం కిలో చొప్పున కుటుంబానికి 35 కేజీలు అందజేయడం.
-ముందుగా లబ్ధిదారులను గుర్తించి ఈ కోటా కింద అర్హులైన వారి వివరాలు నమోదు అనంతరం కార్డులను అందించడం.
-అయితే పథకం ప్రారంభంలో 25 కేజీలు అందించగా, 2002 ఏప్రిల్లో 35 కేజీలకు పెంచారు.
-ఈ పథకాన్ని మొదటిసారిగా రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించారు.
-2002-03లో 41.27లక్షల టన్నుల ఆహారధాన్యాలను కేటాయించగా, 35.39 లక్షల టన్నులను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేసింది.
-జూన్ 2003 నాటికి అదనంగా మరో 50 లక్షల నిరుపేద కుటుంబాలను పథకం పరిధిలోకి తీసుకొచ్చారు.
-2003-04లో 38.24లక్షల టన్నుల ఆహారధాన్యాల కేటాంపునకుగాను 45.65లక్షల టన్నులు కేటాయించింది.
-మరింతగా విస్తరించి 2004 నాటికి మొత్తంగా 2 కోట్ల కుటుంబాలను లబ్ధిదారులుగా గుర్తించారు.
-ఈ పథకాన్ని సవరిస్తుండగా, లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ 2016లో ప్రస్తుతం 2.50 కోట్ల కుటుంబాలకు చేరింది.
-ఈ పథకం కింద్ర ప్రయోజనం పొందుతున్న కుటుంబాలకు అందించే కార్డు గులాబీ రంగు గీతతో ముద్రించిన కార్డులను అందిస్తున్నారు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు