A program of twenty principles | ఇరవై సూత్రాల కార్యక్రమం
-ఈ కార్యక్రమాన్ని 1975లో ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు.
-దీన్ని పేదరికం నిర్మూలన, ఉపాధి, విద్య, గృహవసతి, ఆరోగ్యం, వ్యవసాయం, భూ సంస్కరణలు, నీటిపారుదల, తాగునీరు, సామాజిక న్యాయం, లింగ సమానత్వం, మురికివాడల అభివృద్ధి, బాధ్యతాయుత పరిపాలన, రక్షణ, బలహీన వర్గాల సాధికారత, వినియోగదారుల రక్షణ, పర్యావరణం లాంటి 20 లక్ష్యాలను, దాని 66 అంశాలను సాధించడానికి ఎంపికచేశారు.
-కార్యక్రమ పర్యవేక్షణ, అమలుకు కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖకు కేటాయించారు.
-దీన్ని మొదటిసారిగా 1982,1986ల్లో సవరించారు.
-దీని విజయాలు, అనుభవాల నేపథ్యంలో కొత్త విధానాలను అనుసరించి పునర్నిర్మాణంలో భాగంగా పేదరిక నివారణకు ఉత్పాదకతను పెంచడం, ఆదాయ అసమానతలు తగ్గించడం, తొలగించడం, సామాజిక, ఆర్థిక అంతరాలను పునర్వ్యవస్థీకరించారు.
-జాతీయ కనీస ఉమ్మడి కార్యక్రమం, యునైటెడ్ నేషన్స్ మిలీనియం డెవలప్మెంట్, సార్క్ సామాజిక శాసనపత్రం, సహస్రాబ్ది ప్రకటన, 2000 శాంతి హక్కు నివేదించిన లక్ష్యాలను పొందుపర్చారు.
-అభివృద్ధికి బలమైన నిబద్ధత, భద్రత, లింగ సమానత్వం, పేదరికాన్ని అనేక కోణాల్లో రూపుమాపడానికి స్థిరమైన మానవ అభివృద్ధికి సంబంధించిన అంశాలను పేర్కొన్నారు.
-కార్యక్రమంలోని వివిధ పథకాలను పునర్నిర్మించాలని 2006లో 65 అంశాలను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని విధాన కార్యాచరణ ఏప్రిల్ 2007లో ప్రారంభించారు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు