‘పది’లో ఆరు.. కావద్దు బేజారు!
- ఎస్ఎస్సీ వార్షిక పరీక్షలో 6 పేపర్లు
కొవిడ్కు ముందు పదో తరగతి పరీక్షలు ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు, హిందీకి ఒక పేపర్ చొప్పున 11 పేపర్లకు నిర్వహించేవారు. కొవిడ్ కారణంగా గత సంవత్సరం 70 శాతం సిలబస్తో ఆరు పేపర్లతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ విద్యాసంత్సరం నుంచి ఇక 100 శాతం సిలబస్తో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యాశాఖ ఈ మార్పును ప్రకటించడమే కాక ప్రశ్నపత్ర నమూనాలో కూడా మార్పులు చేసింది. లఘు, అతి లఘు సమాధాన ప్రశ్నల్లో చాయిస్ ఉండదు. వ్యాసరూప ప్రశ్నల సంఖ్య పెరిగింది. వ్యాసరూప ప్రశ్నల్లో మాత్రమే అంతర్గత చాయిస్ ఉంటుంది. ‘సి’ గ్రేడ్ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండి ప్రత్యేక సూచనలు పాటించాలి. పరీక్ష సమయం దగ్గర పడుతుంది. సన్నద్ధతపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి. నూతన పరీక్ష విధానంలో విషయ అవగాహనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పాఠ్యవిషయాన్ని తగ్గించి కేవలం ముఖ్యాంశాలను విశదీకరిస్తూ వాటిపై జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం, నిత్యజీవిత అన్వయానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. అందువల్ల పని అనుభవం, స్వీయ రచన, బృందచర్చల ద్వారా నేర్చుకోవడం అనే విధానాన్ని అనుసరించాలి.
ఇంగ్లిష్
పార్ట్ ఎ- 60 మార్కులు
ఎ) రీడింగ్ కాంప్రహెన్షన్, స్టడీ స్కిల్స్- 32
బి) వొకాబులరీ, గ్రామర్- 8
సి) క్రియేటివ్ రైటింగ్- 20 మార్కులు
పార్ట్ బి- 20X1 = 20
ప్యాసేజ్/ పోయం- 5 మార్కులు
వొకాబులరీ, గ్రామర్ – 15 మార్కులు
ఇంగ్లిష్ రీడర్లోని పాఠాలు, పోయమ్స్కు సంబంధించిన ముఖ్యాంశాలను అవగాహన చేసుకుని ముఖ్యమైన పాయింట్లు గుర్తుంచుకుంటే సులభంగా సమాధానం రాయవచ్చు.
ప్రశ్నపత్రంలో గద్య, పద్య భాగాలను చదివి, అన్సీన్ ప్యాసేజ్, అన్సీన్ పోయమ్లను అవగాహన చేసుకోవాలి. వాక్య దోషాలను సరిచేయడం, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్పై ఇచ్చిన ఖాళీలను పూరించడం ప్రాక్టీస్ చేయాలి.
గద్యభాగాన్ని చదివి స్వయంగా సంభాషణ రూపంలో గాని, ప్రొఫైల్ రూపంలో గాని, సందేశ రూపంలో గాని రాసేలా సిద్ధమవ్వాలి.
టెక్ట్స్బుక్లో ప్రతి యూనిట్ వెనుక ఉన్న గ్రామర్ ప్రాక్టీస్ చేయాలి.
బిజినెస్, పర్సనల్ లెటర్స్ రాయడం నేర్చుకోవాలి. సందర్భోచిత లేఖలు, బయోగ్రాఫికల్ స్కెచ్, కన్వర్జేషన్, బయోడేటా తయారీ వంటి అంశాలపై దృష్టిపెట్టాలి.
పాఠశాలల్లో జరిగే చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే, రిపబ్లిక్ డే వంటి కార్యక్రమాలపై వ్యాసం రాసేలా సిద్ధం కావాలి.
Steps taken to ensure the passing of Low Proficient 10th Class Students
Aware of the Question Paper pattern, which bit contains which.
questions and how to answer
Revision systematically, going bit wise, according to the question paper pattern.
Reading comprehension is very important for a student to get a good score. Select important reading passages from the text book and practice with ample number of possible questions.
Making a list of the most important Verbs and Adverbs and their meaning will also help the very low proficient students to attain basic skills to understand the sentences.
Practice writing or saying simple sentences using those verbs and adverbs.
Basic tenses and usage of different tenses in different situations. But do not spend much time on this.
Eanings of the different question words (What, Who, When, etc.)
Understand the questions based on the key words in the given question.This way can guess and understand the meaning of the question even though we do not know the meaning of all the words in the question.
Frame simple questions based on a paragraph. Let this be a daily practice.
Reading process and meaning making of a given passage.
Identify Discourses (skeletal Structures) models given in lower class text books how to modify such model discourses according to the question given in the exam.
విద్యా ప్రమాణాలను గుర్తించాలి
ప్రశ్నపత్రాన్ని విద్యాప్రమాణాలకు అనుగుణంగా రూపకల్పన చేస్తున్నారు. దీనివల్ల ఏవో కొన్ని అధ్యాయాలను చదివితే సరిపోదు. అన్ని అధ్యాయాలను చదవాల్సిందే. ప్రశ్నలు ఏ అధ్యాయం నుంచైనా, ఏ రకమైనవైనా అడగవచ్చు. కాబట్టి విద్యాప్రమాణాలకు అనుగుణంగా ప్రశ్నలను గుర్తించి పరీక్షలకు సన్నద్ధం కావాలి. ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఉండవు. విద్యార్థి తన అవగాహనకు అనుగుణంగా సమాధానాలు రాసే వీలుంది. ప్రస్తుత విధానంలో అన్ని పాఠాలను విధిగా చదివి అవగాహన చేసుకోవాలి. పాఠ్యపుస్తకంలోని ఏ అంశం కూడా బట్టీ పట్టి రాయడానికి ఆస్కారం ఉండదు. పాఠ్యపుస్తకంలోని అంశాలు, భావనలను అవగాహన చేసుకుని నిజ జీవితానికి అన్వయిస్తూ సమాధానాలు రాయాలి. సమాధానాలు సూటిగా రాయడానికి బదులు బహుళ సమాధానాలు వచ్చేలా ప్రశ్నల స్వభావం ఉంటుంది. ఒకసారి పబ్లిక్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు తిరిగి పునరావృతం కావు. పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ప్రశ్నలు ఉన్నవి ఉన్నట్టుగా రావు. అవే స్వభావంగల ఇతర ప్రశ్నలను రూపొందించి ఇస్తారు. ప్రశ్నలు విద్యార్థుల్లో సృజనాత్మకత, విలువలు, సౌందర్యాత్మక స్పృహ, సహజవనరుల సంరక్షణ, మానవతా విలువలు, జాతీయ సమైక్యత మొదలైన అంశాలను అంచనా వేసే విధంగా రూపొందిస్తారు. కాబట్టి సొంతంగా ఆలోచించి సమాధానాలు రాసేలా ప్రిపరేషన్ కొనసాగాలి.
మూల్యాంకన విశ్లేషణ..
ప్రస్తుత విధానంలో హిందీతో పాటు
మిగతా భాష, భాషేతర సబ్జెక్టులకు ఒకటే పేపర్. ఒక్కో పేపర్లో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు.20 మార్కులకు పాఠశాలలో ఫార్మేటివ్ (అంతర్గత) మూల్యాంకనం ద్వారా ఉపాధ్యాయులు మార్కులు కేటాయిస్తారు.
తెలుగు
పార్ట్ ఎ- 60 ర్కులు
1. అవగాహన-ప్రపతిస్పందన
(పఠన అవగాహన)- 20 మార్కులు
అ) పరిచిత గద్యంలో ఉపవాచకానికి సంబంధించి 8-10 వాక్యాలు రెండు పేరాల్లో ఇస్తారు. వీటికి సంబంధించి 5 ప్రశ్నలు ఇస్తారు. 5X1 = 5
ఆ) పరిచిత పద్యంలో పాఠ్య పుస్తకంలోని చుక్క గుర్తు ఉన్న పద్యాలు అంతర్గత చాయిస్తో ఇస్తారు. వీటికి సంబంధించి పద్యాన్ని పూరించి భావం రాయమని లేదా పద్యాన్ని ఇచ్చి ప్రతిపదార్థం రాయమని అడుగుతారు. 5X1 = 5
ఆ) అపరిచిత గద్యం/పద్యంలో ఏదో ఒకటి ఇస్తారు. గద్యం అయితే వైజ్ఞానిక, సామాజిక, పర్యావరణ వంటి అంశాలపై 8-10 వాక్యాలు రెండు పేరాల్లో ఇస్తారు. పద్యం అయితే సరళమైనది, సులభమైనది, బాగా ప్రాచుర్యం ఉన్న శతకాల నుంచి ఇవ్వవచ్చు. వీటికి సంబంధించి 5 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. 5X2 =10
2. సృజనాత్మక-వ్యక్తీకరణ- 40 మార్కులు
అ) 5 లేక 6 వాక్యాల్లో లఘు సమాధానాలు రాసేవి 4 ప్రశ్నలు చాయిస్ లేకుండా ఇస్తారు. 4X3 = 12
ఆ) పద్యభాగం నుంచి ఒకటి, గద్య భాగం నుంచి ఒకటి, ఉపవాచకం నుంచి ఒకటి, సృజనాత్మకతకు సంబంధించి ఒకటి అంతర్గత
చాయిస్తో 4 వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారు. 4X7 = 28
పార్ట్ బి- 20 X 1 = 20 మార్కులు
భాషాంశాలకు చెందిన ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 10 పదజాలానికి, 10 వ్యాకరణాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. మొదట రెండు పదాలకు సొంత వాక్యాలు అడుగుతారు. 8 ప్రశ్నలు పర్యాయ పదాలు, నానార్థాలు, అర్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, ప్రకృతి వికృతులు అడుగుతారు. 10 వ్యాకరణాంశ ప్రశ్నల్లో సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాల (సంశ్లిష్ట, సంయుక్త, కర్తరి, కర్మణి, ప్రత్యక్ష/పరోక్ష కథన, ఆధునిక వాక్యాలు) నుంచి ప్రశ్నలు అడుగుతారు. అన్ని కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలు. మొత్తం 20X1 = 20.
ఇది తొలి పరీక్ష కావడం వల్ల భయాందోళన, ప్రాథమిక అంశాలు, వ్యాకరణం, పద్య రచనల్లో విద్యార్థులకు అభిరుచి లేకపోవడం, తేలికైన తెలుగులో తక్కువ మార్కులు రావడానికి కారణమవుతున్నాయి. మాతృభాషే కదా చాలా సులభమనే భావనతో, అతి విశ్వాసంతో చివరికి ఫెయిలై బాధ పడుతుంటారు. తెలుగును తేలిగ్గా తీసుకోవడం మరో కారణం. మాతృభాషపై మమకారం పెంచుకుని, చిన్న చిన్న మెలకువలను పాటిస్తూ, కొద్దిగా శ్రమిస్తే పది పాయింట్లు దక్కించుకోవచ్చు.
పాఠ్యాంశాలను చదివేటప్పుడు శ్రద్ధ, సమయ పాలన, కచ్చితత్వం అవశ్యం.
సవర్ణ దీర్ఘ, గుణ, త్రిక సంధుల ఉదాహరణలను బాగా చదవాలి.
వ్యాసరచన ప్రశ్నల్లో ఎక్కువగా అడిగే అవకాశమున్న పండుగలు, సమకాలీన అంశాలు, ఎయిడ్స్ వ్యాధి, ప్రపంచీకరణ, ప్రకృతి విపత్తుల వంటి అంశాలపై బాగా అవగాహన పెంచుకోవాలి.
ప్రకృతి వికృతులు, పద్య లక్షణాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తర్థాలు, అలంకారాలు, నానార్థాలు, ఛందస్సు, పరోక్ష వాక్యాలు, సంయుక్త వాక్యాలు, విగ్రహ వాక్యాలు, సమాసానికి ఉదాహరణలపై అవగాహన పెంచుకుంటే మార్కులు సులభంగా పొందవచ్చు.
ప్రతిపాఠం కవి, కవి పరిచయం, శతక పద్యాలు, భావాలు, పాఠ్యపుస్తకం వెనుక ఉన్న ఉదాహరణలు, వ్యాకరణాంశాలు ప్రాక్టీస్ చేయాలి.
అర్థ సందర్భాలు సందర్భానికి తగినట్లుగా రాయాలి.
జాతీయానికి, సొంతవాక్యాలకు ఉన్న తేడాను గమనించి సమాధానాలు రాయాలి.
పఠన అవగాహనలో తెలిసిన, తెలియని గద్య పద్య అంశాలను చదివి అవగాహన చేసుకుని సమాధానాలు రాస్తే 20 మార్కులు పొందవచ్చు.
గైడ్ కన్నా పాఠ్యపుస్తకానికే ప్రాధాన్యం ఇవ్వాలి.
సమాధానల్లో స్పష్టత, దస్తూరి అందంగా ఉండాలి.
భౌతిక-రసాయన, జీవశాస్త్ర సబ్జెక్టులు: ఇది ఒకే రోజు నిర్వహిస్తారు. భౌతిక-రసాయన పేపర్కు గంటన్నర, జీవశాస్త్ర పేపర్కు గంటన్నర రెండింటి మధ్య 20 నిమిషాల విశ్రాంతి ఇస్తారు.
పార్ట్ ఎ- 30 మార్కులు
అతి లఘు సమాధాన ప్రశ్నలు 3. మార్కులు 2. మొత్తం 6 మార్కులు. చాయిస్ ఉండదు.
లఘు సమాధాన ప్రశ్నలు 3. మార్కులు 3. మొత్తం 9 మార్కులు. చాయిస్ లేదు.
వ్యాసరూప ప్రశ్నలు 3. మార్కులు 5. మొత్తం 15 మార్కులు. అంతర్గత చాయిస్ ఉంటుంది.
పార్ట్ బి- 10 మార్కులు
బహుళైచ్ఛిక ప్రశ్నలు 10. ప్రశ్నకు 1 మార్కు. మొత్తం 10 మార్కులు. చాయిస్ ఉండదు.
ఒక్కో పేపర్కు మొత్తం 40 మార్కులు. 14 మార్కుల చొప్పన రెండు పేపర్లలో కలిపి 28 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత.
విద్యా ప్రమాణాలు-వాటి భారత్వం
AS (ACADEMIC
STANDARDS) 1 విషయావగాహన- 40% – 16 మార్కులు
AS 2- ప్రశ్నించడం, పరికల్పన చేయడం- 5% – 2 మార్కులు
AS 3- ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు- 17.5% – 7 మార్కులు
AS 4- సమాచార సేకరణ నైపుణ్యం, ప్రాజెక్టు పనులు- 7.5% – 3 మార్కులు
AS 5- బొమ్మలు గీయడం, నమూనాల తయారీ- 15% – 6 మార్కులు
AS 6- అభినందన, సౌందర్యాత్మక స్పృహ, విలువలు పాటించడం, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యాన్ని గుర్తించి కాపాడటం- 15% – 6 మార్కులు
ఈ సబ్జెక్టుల్లో మార్కుల సాధనకు పటాలు కీలకం. కాబట్టి పటాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
ఏ ప్రశ్నను ఎలా తిప్పి అడిగే అవకాశం ఉందో ఊహించుకుని చదవాలి.
విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రశ్నపత్రం రూపొందిస్తారు. కాబట్టి అన్ని అధ్యాయాలు ముఖ్యమైనవే.
ఫార్ములాలను గుర్తుంచుకోవాలి.
అడిగే ప్రతి ప్రశ్న బహుళ సమాధానాలకు అవకాశం కల్పించేదిగా ఉంటుంది.
జీవ శాస్త్రంలో మూస పద్ధతిలో బట్టీ పట్టకుండా శరీర భాగాలు-వ్యవస్థలు, పనితీరు, నియంత్రణ, ప్రకృతి అంశాలను అవగాహనతో చదవాలి.
భౌతిక శాస్త్రంలో ఉష్ణం, కాంతి, విద్యుత్ అధ్యాయాలు అతి ముఖ్యమైనవి.
ప్రయోగాలు-క్షేత్ర పర్యటనల నుంచి కచ్చితంగా 5 మార్కుల ప్రశ్న అడుగుతున్నారు. అందుకు ప్రయోగకృత్యాలైన దర్పణాలు, ఓమ్ నియమ నిరూపణ, కటకాల నాభ్యంతరం కనుక్కునే విధానం, ఆమ్ల ద్రావణాల విద్యుత్ వాహకత ప్రయోగం, ఇనుపు తుప్పుపట్టే విధానం వంటి ప్రయోగాలు, కృత్యాలు, పరికరాలు, ప్రయోగ విధానం, జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.
సమాచార సేకరణ నైపుణ్యం నుంచి కొంత సమాచారం పట్టిక రూపంలో అడిగి దాని ఆధారంగా 3 మార్కులకు ప్రశ్నలు అడుగుతున్నారు. అలాగే బొమ్మలు గీయడం-నమూనాల తయారీ నుంచి ఒక ఒకమార్కు, ఒక 5 మార్కుల ప్రశ్న అడుగుతున్నారు. వీటి కోసం దర్పణాలు, కటకాలు వివిధ సందర్భాల్లో ఏర్పరిచే ప్రతిబింబాలు, దృష్టిలోపాలు, దండయస్కాంతం ఏర్పరిచే బలరేఖలు, విద్యుత్ ప్రవాహ వలయాల గురించి చదవాలి.
రసాయన శాస్త్రంలో పరమాణు నిర్మాణం, రసాయనబంధం, రసాయన చర్యలు, సమీకరణాలు, సమీకరణాలు తుల్యం చేయడం, ఆమ్లాలు-క్షారాలు, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక, కార్బన్, దాని సమ్మేళనాలు, నూతన అధ్యాయం లోహ సంగ్రహణంపై ఎక్కువ దృష్టిసారించాలి.
సాంఘిక శాస్త్రం
అతి లఘు సమాధాన ప్రశ్నలు 6. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. మొత్తం 12 మార్కులు. చాయిస్ ఉండదు.
లఘు సమాధాన ప్రశ్నలు 6. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. మొత్తం 18 మార్కులు. చాయిస్ ఉండదు.
వ్యాసరూప ప్రశ్నలు 6. ఒక్కో ప్రశ్నకు 5 మార్కులు. మొత్తం 30 మార్కులు. అంతర్గత చాయిస్ ఉంటుంది.
పార్ట్ బి- 20 మార్కులు
బహుళైచ్ఛిక ప్రశ్నలు 20. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు. మొత్తం 20 మార్కులు. చాయిస్ లేదు.
కనీసం 28 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత.
విద్యాప్రమాణాలు
విషయ అవగాహన- 45%- 36 మార్కులు
వ్యాఖ్యానించడం- 12.5% – 10 మార్కులు
సమాచార నైపుణ్యం- 12.5% – 10 మార్కులు
సమకాలీన అంశాలపై ప్రతిస్పందన- 11.25% – 9 మార్కులు
పట నైపుణ్యాలు-12.5% – 10 మార్కులు
ప్రశంస, సున్నితత్వం- 6.25%- 5 మార్కులు
ప్రశ్నలు విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న జ్ఞానాన్ని, అవగాహన సామర్థాన్ని, నైపుణ్యాన్ని పరీక్షించేలా రూపొందిస్తారు.
వనరుల అభివృద్ధి, సమానత (భూగోళం, అర్థశాస్త్రం), సమకాలీన ప్రపంచం, భారతదేశం (చరిత్ర, పౌరశాస్త్రం) అనే పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
పట నైపుణ్యాన్ని బాగా సాధన చేయాలి. పాఠశాలలోనే కాకుండా ఇంటివద్ద కూడా ఇండియా, వరల్డ్ మ్యాప్లలో ప్రధాన ప్రాంతాలు, అంశాల ఉనికిని ప్రాక్టీస్ చేయాలి.
భారతదేశ పటం, ప్రపంచ పటం అంతర్గత చాయిస్తో ఇస్తారు.
సమకాలీన అంశాలపై ప్రతిస్పందనకు ప్రతిరోజూ దినపత్రికలను చదవాలి.
పాఠ్యాంశాల చివర ఉన్న కీలక పదాలు,
నిర్వచనాలు, పట్టికలు, గ్రాఫ్లను విశ్లేషణ చేసుకుంటూ చదవాలి.
గణితం
పార్ట్ ఎ- 30 మార్కులు
అతి లఘు సమాధాన ప్రశ్నలు 6 ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు మార్కులు 2. మొత్తం 12 మార్కులు. చాయిస్ ఉండదు.
లఘు సమాధాన ప్రశ్నలు 6. ఒక్కో ప్రశ్నకు మార్కులు 3. మొత్తం 18 మార్కులు. చాయిస్ లేదు.
వ్యాసరూప ప్రశ్నలు 6. ఒక్కో ప్రశ్నకు 5 మార్కులు. మొత్తం 30 మార్కులు. అంతర్గత చాయిస్ ఉంటుంది.
పార్ట్ బి- 20 మార్కులు
బహుళైచ్ఛిక ప్రశ్నలు 20. 1 మార్కు. మొత్తం 20 మార్కులు. చాయిస్ ఉండదు.
కనీసం 28 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత.
విద్యా ప్రమాణాలు
సమస్య సాధన- 40% – 32 మార్కులు
కారణాలు చెప్పడం, నిరూపించడం- 20% – 16 మార్కులు
వ్యక్తపరచడం- 10% – 8 మార్కులు
అనుసంధానం- 15% – 12 మార్కులు
దృశ్యీకరణ-ప్రాతినిథ్య పరచడం- 15% – 12 మార్కులు
గణిత విద్యాప్రమాణాలను అవగతం చేసుకుని పట్టుసాధిస్తే 10 గ్రేడ్ పాయింట్లు సాధించవచ్చు.
ఏ అధ్యాయంనుంచైనా ఎన్ని ప్రశ్నలైనా అడుగవచ్చు. ప్రతి అధ్యాయం కీలకమే.
ప్రతి అధ్యాయంలో సూత్రాలు, భావనలను, వాటి ద్వారా సాధించగలిగే సమస్యలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
ప్రతి భావనపై సమస్యలను స్వయంగా రూపొందించుకుని సాధన చేయాలి.
పాఠ్య పుస్తకంలో ఉన్న సమస్యలు నేరుగా అడగరు. వాటిని మార్చి అవే స్వభావం గల ప్రశ్నలు ఇస్తారు.
వ్యాసరూప ప్రశ్నలకు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. కారణాలు వివరించడం, దృశ్యీకరణ-ప్రాతినిథ్యపరచడం, సమస్య సాధన వంటి ప్రశ్నలు ఎక్కువగా వ్యాసరూప ప్రశ్నల్లో ఇస్తుంటారు.
సమితులు, శ్రేఢులు, సిద్ధాంతాలు, నిరూపక జ్యామితి, సాంఖ్యక శాస్త్రం, సరూప త్రిభుజాలు, క్షేత్రమితి, త్రికోణమితి అనువర్తనాల నుంచి వ్యాసరూప ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
ప్రతి అధ్యాయంలో ప్రాథమిక భావనలు, సూత్రాలు, నిర్వచనాలు బాగా చదవడం వల్ల స్వల్ప, అతిస్వల్ప, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు తేలికగా జవాబులు రాయవచ్చు.
పాఠ్య పుస్తకంలోని ‘ఆలోచించి, చర్చించి రాయండి’ ‘ఇవి చేయండి’ ‘ప్రయత్నించండి’ అని ఇచ్చిన సమస్యలను కచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి
ఎండీ సలీం షరీఫ్
ఎంఈవో, కోదాడ
సూర్యాపేట జిల్లా , 9948506786
- Tags
- Education News
- text books
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






