స్టెమ్తో ఉజ్వల భవిష్యత్తు
బాలికలు నైపుణ్యం పెంచుకోవాలి: మంత్రి కేటీఆర్
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) అంశాల్లో బాలికలు నైపుణ్యం పెంచుకోవాలని, ఇవే వారికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని వీ-హబ్లో నిర్వహించిన గర్ల్స్ ఇన్ స్టెమ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థులు 3డీ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. 3డీ అంటే డిజిటైజ్, డీ కార్బనైజ్, డీసెంట్రలైజ్- ఈ మూడూ విద్యార్థులకు ఎంతో కీలకమని చెప్పారు. వీటి ద్వారా వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఉద్బోధించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, వారిని వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించేందుకు వీ-హబ్ స్టార్టప్ ఇంక్యుబేటర్ను ఏర్పాటు చేసిందని వివరించారు. సమావేశంలో వీ-హబ్ సీఈవో దీప్తి రావుల, వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు.
- Tags
- Bright future
- KTR
- STEM
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?