ఐఐటీహెచ్లో కొత్తగా ఆప్తాల్మిక్ ఎంటెక్ కోర్సు
# జూలై 7వరకు దరఖాస్తుల స్వీకరణ
ఐఐటీ హైదరాబాద్.. ఎంటెక్లో సరికొత్త కోర్సును ప్రవేశపెట్టింది. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో కలిసి ఆప్తాల్మిక్ ఎంటెక్ కోర్సును ఐఐటీ హైదరాబాద్ శుక్రవారం ప్రారంభించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే ఈ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సులో చేరాలనుకొనేవారు జూలై 7లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఆగస్టు నుంచి కొత్త బ్యాచ్ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. నేత్ర సంరక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు వీలుగా ఐఐటీ హైదరాబాద్, సెంటర్ఫర్ ఇంటర్ డిసిప్లినరీ(సీఐపీ), ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కలిసి సంయుక్తంగా ఆప్తాల్మిక్ ఇంజినీరింగ్లో బ్లెండెడ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ(ఎంటెక్) కోర్సును డిజైన్ చేశాయని పేర్కొన్నారు.
- Tags
- IIT Hyderabad
- LV Prasad
- M.Tech
Previous article
ఓఎన్జీసీలో ఖాళీ పోస్టుల భర్తీ
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






