ఐఐటీహెచ్లో కొత్తగా ఆప్తాల్మిక్ ఎంటెక్ కోర్సు
# జూలై 7వరకు దరఖాస్తుల స్వీకరణ
ఐఐటీ హైదరాబాద్.. ఎంటెక్లో సరికొత్త కోర్సును ప్రవేశపెట్టింది. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో కలిసి ఆప్తాల్మిక్ ఎంటెక్ కోర్సును ఐఐటీ హైదరాబాద్ శుక్రవారం ప్రారంభించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే ఈ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సులో చేరాలనుకొనేవారు జూలై 7లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఆగస్టు నుంచి కొత్త బ్యాచ్ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. నేత్ర సంరక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు వీలుగా ఐఐటీ హైదరాబాద్, సెంటర్ఫర్ ఇంటర్ డిసిప్లినరీ(సీఐపీ), ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కలిసి సంయుక్తంగా ఆప్తాల్మిక్ ఇంజినీరింగ్లో బ్లెండెడ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ(ఎంటెక్) కోర్సును డిజైన్ చేశాయని పేర్కొన్నారు.
- Tags
- IIT Hyderabad
- LV Prasad
- M.Tech
Previous article
ఓఎన్జీసీలో ఖాళీ పోస్టుల భర్తీ
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?