మార్చి 25 వరకు నీట్ పీజీ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: నీట్ పీజీ (NEET PG) ప్రవేశ పరీక్షను కేంద్ర ఆరోగ్య శాఖ వాయిదావేసింది. దీంతో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. అభ్యర్థులు మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షకు సంబంధించిన వివరాలు nbe.edu.in, natboard.edu.in వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. నీట్ పీజీ పరీక్ష మే 21న జరగనున్నది.
నీట్ పీజీ కౌన్సెలింగ్, ప్రవేశ పరీక్ష తేదీలు క్లాష్ అవుతుండటంతో పలువురు అభ్యర్థులు నీట్ పీజీ 2022ని వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మే 21న పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ పరీక్షను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
నీట్ పీజీ-2022 సవరించిన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ల దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 25
అడ్మిట్ కార్డుల విడుదల: మే 16
నీట్ పీజీ పరీక్ష తేదీ: మే 21
ఫలితాల విడుదల: జూన్ 20
వెబ్సైట్: natboard.edu.in
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?