ఏప్రిల్ 1 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆరోదశ పరీక్ష

హైదరాబాద్: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి ఆరో దశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలు వచ్చేనెల 1, 3, 5, 6, 7, 8 తేదీల్లో జరగనున్నాయి. అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రైల్వేరిక్రూట్మెంట్ బోర్డు 2019లో 35,208 పోస్టులతో ఎన్టీపీసీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్ ఆధారితంగా జరుగుతున్న ఈ పరీక్షలు (సీబీటీ) గతేడాది డిసెంబర్ 28న ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో పరీక్షలను దశలవారీగా నిర్వహిస్తున్నారు.
ఈ లెవల్ను పూర్తిచేసిన వారిని తదుపరి రౌండ్లకు ఎంపిక చేస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. గణితం, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాల్లో పరీక్ష పూర్తవుతుంది. తుది ఫలితాల్లో ఎంపికైనవారిని ట్రైన్ క్లర్క్, జూనియర్ క్లర్క్, టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్, జూనియర్ టైమ్ కీపర్ తదితర పోస్టుల్లో నియమిస్తారు.
వెబ్సైట్: www.rrbsecunderabad.nic.in
- Tags
- CBT
- Junior clerk
- NTPC
- Recuritment
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






