ఎంసెట్ కు గెజిటెడ్ ధ్రువీకరణ అక్కర్లేదు
ఎంసెట్ కు హాజరయ్యే విద్యార్థులకు ప్రింట్ తీసిన ఆన్ లైన్ దరఖాస్తుపై గెజిటెడ్ ధ్రువీకరణ అక్కర్లేదని కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ వెల్లడించారు. ఆన్ లైన్ దరఖాస్తుపై విద్యార్థి ఫొటో అతికించి గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించాల్సి ఉండగా, తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్టు చెప్పారు. ఎంసెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు. విద్యార్థులు రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులు మాస్క్ ధరించాల్సిందేనని తెలిపారు. విద్యార్థులు ఏదైనా గుర్తింపు కార్డు, హాల్ టికెట్ తోపాటు చిన్నసైజు వాటర్ బాటిల్ , శానిటైజర్ ను వెంట తెచ్చుకోవాలని సూచించారు. సెషన్ కు 29 వేల మంది చొప్పున మొత్తం ఆరు సెషన్స్లో 1.72 లక్షల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్టు తెలిపారు. విద్యార్థుల నుంచి వేలిముద్రలు తీసుకుంటామని, మెహిందీ లాంటివి చేతికి పెట్టుకోవద్దని సూచించారు.
RELATED ARTICLES
Latest Updates
మెదడు, శరీరభాగాలకు మధ్య సంధాన కర్తగా పనిచేసేది?
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో.. ఐడీబీఐ బ్యాంకులో 500 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
Union Bank Recruitment | యూనియన్ బ్యాంకులో 606 పోస్టులు
PNB Recruitment | పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 1025 పోస్టులు
IIT Tirupati Recruitment | తిరుపతి ఐఐటీలో ప్రొఫెసర్ పోస్టులు
PMBI Recruitment | పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NALCO Recruitment | నాల్కోలో జూనియర్ ఫోర్మెన్ పోస్టులు
TMREIS Adissions | మైనారిటీ స్కూల్స్లో ప్రవేశాలు
HCL Recruitment | హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
NPCIL Recruitment | ఎన్పీసీఐఎల్లో ట్రెయినీ పోస్టులు