ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్
# సీఎస్ఈలో 21% సీట్లు మన దగ్గరే
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఎంసెట్ తొలి విడత వెబ్ కౌన్సెలింగ్ ఆదివారం ప్రారంభమైంది. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్ జరుగనున్నది. ఈ నెల 29 వరకు స్లాట్ బుకింగ్, ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. ఈ నెల 23 నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. కాగా, బీటెక్లో అత్యంత డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) సీట్లు తెలంగాణలోనే అధికంగా ఉన్నాయి. జాతీయంగా 3,627 కాలేజీలుంటే వీటిల్లో అన్ని బ్రాంచిలు కలిపి 13.26 లక్షల సీట్లున్నాయి. వీటిలో 1.11 లక్షల సీట్లు తెలంగాణలో ఉండగా, వీటిలో 55 వేల సీట్లు సీఎస్ఈ బ్రాంచివే ఉన్నాయి. జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాలు కలిపి సీఎస్ఈ సీట్లు 2.7 లక్షలకుపైగా ఉన్నాయి. వీటిలో 21 శాతం సీట్లు ఇక్కడే ఉన్నాయి. ఇంజినీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటం, మరికొన్ని కాలేజీలు కోర్సుల మార్పిడికి దరఖాస్తులు సమర్పించడంతో సీఎస్ఈ సీట్ల సంఖ్య మన దగ్గర ఇంకా పెరిగే అవకాశం ఉన్నది.
- Tags
- counselling
- cse
- TS EAMCET
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?