ఎస్టీ గురుకులాల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు
– 6, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశాలకు
– వచ్చే నెల 31న రాత పరీక్ష
సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఆదివారం తెలిపారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్, రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో 9వ తరగతిలో, వికారాబాద్ జిల్లా పరిగి, ఖమ్మంలోని గిరిజన సంక్షేమ గురుకుల స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో 8వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్టు పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు సోమవారం నుంచి జూలై 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 31న రాత పరీక్ష ఉంటుందని వెల్లడించారు. పాఠశాలలవారీగా ఖాళీల వివరాలను www.tswreis.ac.in, www.tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్లలో పెట్టినట్టు తెలిపారు.
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






