కరోనా ఎఫెక్ట్.. ఐఎన్ఐ సెట్ వాయిదావేసిన ఎయిమ్స్
న్యూఢిల్లీ: మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఎన్ఐ-సెట్ 2021 వాయిదాపడింది. కరోనా నేపథ్యంలో వచ్చే నెల జరగాల్సిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐఎన్ఐ సెట్)ను వాయిదావేస్తున్నట్లు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) ప్రకటించింది. జూలై సెషన్కు సంబంధించిన ప్రవేశ పరీక్ష మే 8న జరగాల్సి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండంటో ముందు జాగ్రత్త చర్యగా పరీక్షను పోస్ట్పోన్ చేస్తున్నట్లు వెల్లడించింది.
మళ్లీ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఆరేండ్ల కాలవ్యవధి కలిగిన ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్, ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్షకు సంబంధించిన వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.aiimsexams.ac.inను క్రమం తప్పకుండా చూడాలని అభ్యర్థులకు సూచించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో గుజరాత్ ఒక్కటే ఉందా?
ఆ చిన్నారిని కాపాడిన రైల్వే హీరోకు గిఫ్ట్గా ఖరీదైన బైక్
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
ఆక్సిజన్ను పెంచే వ్యాయామం
అమెరికన్లే మాకు ముఖ్యం!
డబుల్, ట్రిపుల్ మ్యుటెంట్ల మధ్య తేడా లేదు
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు గెలిచి..
సొంత వైద్యం మానుకో!
- Tags
- aiims
- corona
- Entrance Exam
- INI CET
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?