మన బస్తీ-మనబడికి రూ.4 కోట్లు
- భవన నిర్మాణానికి ముందుకు వచ్చిన టాటా సంస్థ
- మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడి
సుల్తాన్బజార్, జూన్ 1: ‘మన బస్తీ – మనబడి’ కార్యక్రమానికి టాటా సంస్థ చేయూతనిచ్చింది. శిథిలావస్థలో ఉన్న హైదరాబాద్లోని సుల్తాన్బజార్ క్లాక్ టవర్ ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని రూ.4 కోట్లతో నిర్మించేందుకు సంకల్పించింది. బుధవారం సుల్తాన్బజార్లోని క్లాక్ టవర్ ప్రభుత్వ పాఠశాలను టాటా సంస్థ ప్రతినిధులతో కలిసి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ఈ పాఠశాల స్థానంలో విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, వసతులతో కూడిన నూతన భవనాన్ని రూ.4 కోట్లతో నిర్మించేందుకు టాటా సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు మన బస్తీ- మన బడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. అనంతరం టాటా సంస్థ ప్రతినిధి కృష్ణారెడ్డి నూతన భవన నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రికి వివరించారు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?