జేఈఈ మెయిన్ (సెషన్ -2) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
హైదరాబాద్ : జేఈఈ మెయిన్ (సెషన్ -2) దరఖాస్తులకు షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. జూన్ 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 30న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జేఈఈ మెయిన్ (సెషన్ -2) ఎగ్జామ్స్ జూలై 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.
20 నుంచి మెయిన్ -1 పరీక్షలు
జేఈఈ మెయిన్ -1 ఎగ్జామ్స్ ఈ నెల 20 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. మొదటి విడత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఈ నెల రెండో వారం నుంచి అడ్మిట్కార్డులు జారీచేస్తారు.
ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్డ్
జేఈఈ మెయిన్ ఫలితాల తర్వాత నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ను ఆగస్టు 28న నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం అయిదున్నర గంటల వరకు పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 7 నుంచి 11 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయొచ్చు.
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?