Protections of the disabled | అశక్తుల రక్షణలు

ది పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ (1995)
-ఈ చట్టం పూర్తిపేరు ద పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ (ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్)- 1995
-ఇది 1996, జనవరి 1న అమల్లోకి వచ్చినప్పటికీ, ఫిబ్రవరి 2 నుంచి పూర్తిస్థాయిలో అమలుచేయబడింది.
-దేశంలో మొదటిసారి వికలాంగులను ఈ చట్టం ద్వారా ఏడు రకాలుగా గుర్తించారు.
-ఆసియా పసిఫిక్ డెకేడ్ ఆఫ్ డిసేబుల్డ్ పర్సన్స్లో ఉన్న నిబంధనల ప్రకారం ఈ చట్టాన్ని రూపొందించారు.
-చట్టంలో పేర్కొన్న 7 రకాల అశక్తతల్లో ఒకటిగానీ అంతకంటే ఎక్కువగానీ అశక్తతలు 40 శాతానికి మించి ఉన్నట్లయితే 3 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
-పనిచేసేచోట, విద్యాలయాల్లో, ప్రభుత్వ ప్రయాణ సౌకర్యాల్లో, ఇతర సామాజిక వనరుల వినియోగానికి సంబంధించి అశక్తులకు స్నేహపూర్వకమైన పరిస్థితులు కల్పించాలని పేర్కొన్నారు.
-అశక్తుల సంక్షేమం అనేది రాజ్యాంగం ప్రకారం 26 యూనిట్లలోని 9వ అంశం అయినప్పటికీ 253వ రాజ్యాంగ నిబంధన ఇచ్చిన అధికారంతో పార్లమెంట్ ఈ చట్టం చేసింది.
-ఈ చట్టాన్ని అనుసరించి చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ని ఏర్పాటుచేశారు.
-కేంద్రంలో సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీ అండ్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటుచేశారు. అన్ని రాష్ర్టాల్లో స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటుచేశారు.
ది మెంటల్ హెల్త్ యాక్ట్- 1987
-1993 April 1 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి.. సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీ, స్టేట్ మెంటల్ హెల్త్ ఆథారిటీలను ఏర్పాటుచేశారు.
-బ్రిటిష్వారు ఏర్పాటుచేసిన Indian Lunacy act – 1912 స్థానంలో దీనిని ఏర్పర్చారు.
-మానసిక అనారోగ్యులకు మానవ హక్కుల భంగం కలుగకుండా చూడటమే ఈ చట్టం ముఖ్యఉద్దేశం
-ఈ చట్టాన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్వారు అమలుపరుస్తున్నారు.
ది నేషనల్ ట్రస్ట్ యాక్ట్- 1999
-ఈ చట్టం పూర్తి పేరు : The National trust for the welfare of persons with Autism, cerebral policy, Mental Retardation and multiple disabilities act – 1999
-ఈ చట్టం కింద నేషనల్ ట్రస్ట్ను రూపొందించారు.
-నిర్మయ: ఇది అశక్తులకు సంబంధించిన బీమా పథకం. 2007లో ప్రారంభించారు. 1,00,000 వరకు వైద్యసేవలకు చెల్లిస్తారు. 1,34,174 మంది రిజిస్టర్ చేసుకున్నారు.
-ARUNIM: అసోసియేషన్ ఫర్ రిహాబిలిటేషన్ అండర్ నేషనల్ ట్రస్ట్ ఇనిషియేటివ్ ఆఫ్ మార్కెటింగ్
n దీనిని అబ్దుల్ కలాం 2008 సెప్టెంబర్ 22న ప్రారంభించారు.
-అశక్తులకు సంబంధించిన హస్తకళా నైపుణ్యాలను/వారు తయారుచేసిన వస్తువులను అమ్మేందుకు మార్కెటింగ్, లోన్ సౌకర్యాలు, ప్రచారాన్ని కల్పిస్తారు.
-2014లో సమర్థ్-2014 పేరు మీద ప్రదర్శనను నిర్వహించారు.
-ఎకనామిక్, ఎంటర్ప్రైజెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనే E3 దీని నినాదం
-సహ్యోగి అనే పథకం కింద మాస్టర్ ట్రెయినీస్కి శిక్షణ ఇస్తున్నారు.
-సంభవ్ పేరు మీద న్యూఢిల్లీలో జాతీయ పునరావాస వనరుల కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.
-సమర్థ్: అశక్తులకు సంబంధించిన తాత్కాలిక, దీర్ఘకాలిక నివాస కేంద్రాలు
-దేశవ్యాప్తంగా 119 కేంద్రాలు ఉన్నాయి.
-అనాథ అశక్తులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
-గరుడ: జీవితకాలపు నివాస కేంద్రాలు
-దేశవ్యాప్తంగా 12 మాత్రమే ఉన్నాయి.
-ఈ సేవలు వయసులో పెద్దవారైన అశక్తులకు మాత్రమే.
-బడ్తే కదమ్ పేరుతో అశక్తుల పట్ల సానుకూల దృక్పథాన్ని సమాజంలో పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు.
-2008 నుంచి జ్ఞాన్ ప్రభావ్ పథకం కింద నెలకు రూ. 1000 చొప్పున ఉపకార వేతనాలను ఇస్తున్నారు.
అసిస్టెన్స్ టు డిసేబుల్డ్ పర్సన్స్ ఫర్ పర్చేజ్
-ప్రతినెలా రూ. 6500-15,000 వరకు ఆదాయం ఉన్నవారికి 100 శాతం ఉచితంగా, రూ. 15,000లకు పైగా ఆదాయం ఉన్నవారికి 50 శాతం రాయితీతో వివిధ పరికరాలు కొనేందుకు సాయం చేస్తారు.
ఏఐఎంఐసీఓ ద్వారా సేవలు
-రాష్ట్రపతి పేరు మీద లాభాపేక్ష లేని సంస్థగా 1972 సెప్టెంబర్లో ఏర్పాటుచేశారు.
-సుమారు 2,00,000 మంది ప్రతి ఏడాది లబ్ధి పొందుతున్నారు.
-2013లో కృత్రిమ అవయవాలపై అవగాహన కల్పించేందుకు స్వావలంబన్ పేరుతో ప్రదర్శన నిర్వహించారు.
డిసేబిలిటీ, ఆరోగ్యపరమైన పథకాలు
-బీసీజీ టీకా- 1962
-ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్- 1978
-1979 నుంచి ఈపీఐలో భాగంగా పోలియో వ్యాక్సిన్ని ఇస్తున్నారు.
-1985 నుంచి ఈపీఐని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (యూఐపీ)గా మార్చారు.
-పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని 1995 నుంచి అమలుపరుస్తున్నారు.
-2014, డిసెంబర్ 25న కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ మిషన్ ఇంద్ర ధనస్సును ప్రారంభించింది.
-జనవరి 18న నేషనల్ ఇమ్యునైజేషన్ డేగా జరుపుకొంటారు.
-2008లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ను ప్రారంభించారు.
-నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ (ఎన్పీపీసీడీ)ను 2007లో ప్రారంభించారు.
-నేషనల్ గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్జీసీపీ)ను 1962లో ప్రారంభించారు.
-1992 ఆగస్టులో ఎన్జీసీపీని ఎన్ఐడీడీసీపీగా మార్చారు.
-2006 మార్చి 17 నుంచి అయోడిన్ రహిత ఉప్పుపై నిషేధం విధించారు.
-1955లో నేషనల్ లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు.
-ఈ పథకాన్ని 1983లో నేషనల్ లెప్రసీ ఎరాడిక్షన్ ప్రోగ్రామ్ (ఎన్ఎల్ఈపీ)గా మార్చారు.
-నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ కార్యక్రమాన్ని 1999లో ప్రారంభించారు.
-ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిసేబుల్ ఎట్ సెకండరీ లెవల్ పథకాన్ని 2009లో ప్రారంభించారు. ప్రస్తుతం దీనిని రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాఅభియాన్ 2013లో భాగంగా అమలు పరుస్తున్నారు.
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
English Grammar | We should all love and respect